Siddaramaiah vs Somanna: బీజేపీ అభ్యర్థికి నిరసన సెగ.. అభివృద్ధిపై మంత్రికి చేదు అనుభవం
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో సమయం దగ్గర పడిన నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ క్రమంలో కొందరికి నిరసన సెగ ఎదురవుతోంది. మే 10న కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్యతో తలపడనున్న బీజేపీ నేత వీ సోమన్నకు ఈరోజు ప్రచార పర్వంలో ఇబ్బంది ఎదురైంది. సోమన్న మైసూరు జిల్లాలోని వరుణ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుండగా ఒక వర్గం ప్రజలు ఆయనను చుట్టుముట్టి ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. హౌసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసిన ఆయన.. మైసూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు. మంత్రిని చుట్టుముట్టిన గ్రామస్థులు నియోజకవర్గంలోని అభివృద్ధిపై నిలదీశారు. మైసూరు ఎంపీ ప్రతాప్సింహ సహా పలువురు బీజేపీ నేతలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించారు.
Also Read: Trisha: స్వర్గం నుంచి దిగివచ్చావా.. నిత్యం అమృతమేమైనా తాగుతున్నావా..?
2018 ఎన్నికలలో గోవింద్రాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన సోమన్న ఈసారి వరుణ, చామరాజనగర రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ లో ఉన్న సోమన్న 2009లో బిజెపిలో చేరారు. వరుణలో బలీయమైన సిద్ధరామయ్య, సోమన్న మధ్య పోటీ జరుగుతోంది. 2008లో ఏర్పాటైనప్పటి నుంచి ఈ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. స్థానిక ప్రజల మద్దతుతో సిద్ధరామయ్య, ఆయన కుమారుడు యతీంద్ర సిద్ధరామయ్యను అసెంబ్లీకి పంపింది. ఎన్నికలలో పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి పదవికి ముందంజలో ఉన్న వారిలో సిద్ధరామాయ్య ఒకరు. వరుణలో మాజీ సీఎం విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన మద్దతుదారులు గట్టి ధీమాతో ఉన్నారు. అయితే సోమన్న కాంగ్రెస్ను ఓడించడం ఖాయమని బీజేపీ ధీమాగా ఉంది.
Also Read: Accenture: 19000 ఉద్యోగాలు తొలగింపు.. ఫ్రెషర్స్ నియామకం ఆలస్యం
Also Read
బిజెపి నాయకుడికి మద్దతుగా జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై మాట్లాడుతూ, సోమన్న అభివృద్ధికి నమూనా అని అన్నారు. కర్ణాటక రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. కొద్దిమంది అణగారిన వర్గాల పేరుతో అధికారాన్ని అనుభవించారు. రాజకీయాల్లో ఎదిగారు కానీ సమాజం మాత్రం వెనుకబడిపోయింది అని విమర్శించారు. వరుణ సామాజికవర్గానికి చెందిన సోమన్నను పోటీకి దింపడం ద్వారా లింగాయత్ల ఓటర్ల స్థావరాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.మైసూరులోని చాముండేశ్వరి ఉపఎన్నికల్లో సిద్ధరామయ్య తరపున ప్రచారం చేసినందున వరుణ నియోజకవర్గం తనకు కొత్త కాదని ఇటీవల మీడియాతో అన్నారు. తాను విజయం సాధించడం ఖాయమని సిద్ధరామాయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ప్రజల మద్దతుతో గెలుస్తానని, సోమన్న లేదా ఎవరైనా తనపై పోటీ చేయనివ్వండి అని సవాల్ చేశారు. వరుణ ప్రజలపై తనకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి తాను ప్రత్యర్థి గురించి చింతించనని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!