Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే.. కర్ణాటక ‘హస్తగతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. వ్యూహాత్మక ఓటింగ్ను ఎంచుకోవడం ద్వారా ముస్లింలు తమ పార్టీకి గట్టి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యలపై పోరాడతాయని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దక్షిణాది రాష్ట్రంలో విజయం మెట్టు రాయిగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 75 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, ఇదే తన చివరి ఎన్నికల యుద్ధం అని పునరుద్ఘాటించారు.
Also Read:CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో తనకు ఎలాంటి లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో స్థానిక, అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పోరు జరగనుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను మాత్రమే లేవనెత్తుతున్నామన్నారు. మోడీ వర్సెస్ రాహుల్ పోటీ జాతీయ స్థాయిలో ఉందన్నారు. మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
ప్రస్తుతం జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలని, ఇది జాతీయ ఎన్నికలు కాదన్నారు. స్థానిక సమస్యలు, బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోబోతున్నారని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా తమకు నమ్మకం ఉందని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. 90 శాతానికి పైగా ఓట్లు తాము ముస్లిం, క్రైస్తవులు కచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KL Rahul: కేఎల్ రాహుల్కు ఊహించని షాక్!
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..