Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే.. కర్ణాటక ‘హస్తగతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. వ్యూహాత్మక ఓటింగ్ను ఎంచుకోవడం ద్వారా ముస్లింలు తమ పార్టీకి గట్టి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యలపై పోరాడతాయని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దక్షిణాది రాష్ట్రంలో విజయం మెట్టు రాయిగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 75 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, ఇదే తన చివరి ఎన్నికల యుద్ధం అని పునరుద్ఘాటించారు.
Also Read:CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో తనకు ఎలాంటి లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో స్థానిక, అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పోరు జరగనుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను మాత్రమే లేవనెత్తుతున్నామన్నారు. మోడీ వర్సెస్ రాహుల్ పోటీ జాతీయ స్థాయిలో ఉందన్నారు. మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలని, ఇది జాతీయ ఎన్నికలు కాదన్నారు. స్థానిక సమస్యలు, బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోబోతున్నారని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా తమకు నమ్మకం ఉందని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. 90 శాతానికి పైగా ఓట్లు తాము ముస్లిం, క్రైస్తవులు కచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..