Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే.. కర్ణాటక ‘హస్తగతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. వ్యూహాత్మక ఓటింగ్ను ఎంచుకోవడం ద్వారా ముస్లింలు తమ పార్టీకి గట్టి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యలపై పోరాడతాయని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దక్షిణాది రాష్ట్రంలో విజయం మెట్టు రాయిగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 75 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, ఇదే తన చివరి ఎన్నికల యుద్ధం అని పునరుద్ఘాటించారు.
Also Read:CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో తనకు ఎలాంటి లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో స్థానిక, అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పోరు జరగనుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను మాత్రమే లేవనెత్తుతున్నామన్నారు. మోడీ వర్సెస్ రాహుల్ పోటీ జాతీయ స్థాయిలో ఉందన్నారు. మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
Also Read
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలని, ఇది జాతీయ ఎన్నికలు కాదన్నారు. స్థానిక సమస్యలు, బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోబోతున్నారని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా తమకు నమ్మకం ఉందని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. 90 శాతానికి పైగా ఓట్లు తాము ముస్లిం, క్రైస్తవులు కచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
-
Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
-
Thalliki Vandanam: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. వారికి కూడా ‘తల్లికి వందనం’ వర్తింపు..
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?