Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే.. కర్ణాటక ‘హస్తగతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. వ్యూహాత్మక ఓటింగ్ను ఎంచుకోవడం ద్వారా ముస్లింలు తమ పార్టీకి గట్టి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యలపై పోరాడతాయని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దక్షిణాది రాష్ట్రంలో విజయం మెట్టు రాయిగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 75 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, ఇదే తన చివరి ఎన్నికల యుద్ధం అని పునరుద్ఘాటించారు.
Also Read:CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో తనకు ఎలాంటి లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో స్థానిక, అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పోరు జరగనుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను మాత్రమే లేవనెత్తుతున్నామన్నారు. మోడీ వర్సెస్ రాహుల్ పోటీ జాతీయ స్థాయిలో ఉందన్నారు. మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
ప్రస్తుతం జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలని, ఇది జాతీయ ఎన్నికలు కాదన్నారు. స్థానిక సమస్యలు, బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోబోతున్నారని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా తమకు నమ్మకం ఉందని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. 90 శాతానికి పైగా ఓట్లు తాము ముస్లిం, క్రైస్తవులు కచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!