Siddaramaiah: కచ్చితంగా ముస్లింల ఓట్లు కాంగ్రెస్కే.. కర్ణాటక ‘హస్తగతం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు. వ్యూహాత్మక ఓటింగ్ను ఎంచుకోవడం ద్వారా ముస్లింలు తమ పార్టీకి గట్టి మద్దతు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రధానంగా స్థానిక సమస్యలపై పోరాడతాయని ఆయన అన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కు దక్షిణాది రాష్ట్రంలో విజయం మెట్టు రాయిగా ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 90 శాతం ముస్లిం ఓటర్లు కాంగ్రెస్కు మద్దతు ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. అధికార బీజేపీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. 75 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు, ఇదే తన చివరి ఎన్నికల యుద్ధం అని పునరుద్ఘాటించారు.
Also Read:CM Jaganmohan Reddy: ముస్లింలకు సీఎం జగన్ రంజాన్ శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో తనకు ఎలాంటి లేవని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో స్థానిక, అభివృద్ధి అంశాలపై ప్రధానంగా పోరు జరగనుందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో చేసిన అభివృద్ధి, స్థానిక సమస్యలను మాత్రమే లేవనెత్తుతున్నామన్నారు. మోడీ వర్సెస్ రాహుల్ పోటీ జాతీయ స్థాయిలో ఉందన్నారు. మోడీ పర్యటనలు కర్ణాటక ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపవన్నారు.
Also Read
ప్రస్తుతం జరుగుతున్నది రాష్ట్ర ఎన్నికలని, ఇది జాతీయ ఎన్నికలు కాదన్నారు. స్థానిక సమస్యలు, బీజేపీ ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలను ప్రజలు పరిగణనలోకి తీసుకోబోతున్నారని సిద్ధరామయ్య చెప్పారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీపైనా, ఆ పార్టీ నాయకత్వంపైనా తమకు నమ్మకం ఉందని ముస్లింలు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ప్రయోజనాలను కాపాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. 90 శాతానికి పైగా ఓట్లు తాము ముస్లిం, క్రైస్తవులు కచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు అని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!