టర్కీపై భారతీయుల బాయ్కట్ ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులను.. పర్యాటకరంగాన్ని నిషేధించారు. ఇలా ఒక్కొక్కటిగా టర్కీకి సంబంధించిన వాటిపై నిషేధం కొనసాగుతోంది.
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
Shiv Sena MP: శివసేన ఎంపీ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన పార్టీ అధినేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేని పొగుడుతూ ఆయన ‘‘ప్రజల సీఎం’’ అని అన్నారు. ఏక్ నాథ్ షిండే రికార్డుల్లో ఉపముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఆయన ప్రజల ముఖ్యమంత్రి అని శివసేన ఎంపీ ధైర్యశీల్ మానే శనివారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత, సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ చేపట్టిని…
Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్లో అనేక మందికి మేనేజర్గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కూడా ఉన్నారు.
Congress: మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ పీసీసీ చీఫ్ నానా పటోలే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతుంటే, శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ తమతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆఫర్ ఇచ్చారు. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసి ప్రతిపక్షంతో చేరితే షిండే, పవార్లు ఇద్దరికీ ముఖ్యమంత్రి పదవులు ఇస్తామని పటోలే శుక్రవారం అన్నారు.
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు.
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు. రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం…
Shiv Sena-UBT: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయంతో పాటు కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంపై ఇండియా కూటమిలోని ఇతర నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ బీజేపీ 48 స్థానాల్లో, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందింది. వరసగా మూడోసారి కూడా కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైంది. 67 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. అత్యంత అవమానకర రీతిలో కాంగ్రెస్ ఓడిపోయింది.
Maharashtra: మహారాష్ట్ర మహయుతి ప్రభుత్వంలో విభేదాలు కనిపిస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వ్యవహార శైలి చూస్తే ఇది నిజమని తెలుస్తోంది. గతేడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన-షిండే, ఎన్సీపీ-అజిత్ పవార్ల కూటమి ఘన విజయం సాధించింది. అయితే, మరోసారి సీఎం పదవిని కోరుకున్న ఏక్నాథ్ షిండే ఆశ నెరవేరలేదు. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టారు.