Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం
- మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకలు..
- శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు.
రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం నిలిపేసిన వారాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది కూటమిలో విభేదాలను మరింతగా పెంచింది. సంరక్షక మంత్రి జిల్లాకు వాస్తవ బాధ్యత వహిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి కమిటీ (DPDC) సమావేశానికి కూడా మంత్రి అధ్యక్షత వహిస్తారు.
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
Read Also: Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..
రాయ్గఢ్ లో శివసేనకు చెందిన భరత గోగావాలే ఈ పదవిపై కన్నేశారు. అయితే, రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న ఎన్సీపీకి చెందిన అదితి తత్కరే కూడా ఈ పదవిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో చర్చించకుండా సమావేశం ఎందుకు జరిగిందో ఎన్సీపీ నాయకత్వం సమాధానాలు ఇవ్వాలని షిండే సేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి తమకు తెలియదని శివసేన ఎమ్మెల్యేలు తెలిపారు.
నిజానికి రాయ్గఢ్ జిల్లాలో శివసేన ఆధిపత్యం స్పష్టంగా ఉండటంతో, ఏక్నాథ్ షిండే తన వర్గానికి చెందిన నేతలకు గార్డియన్ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గత నెలలో దావోస్ మీటింగ్కి వెళ్లే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా తత్కరే పేరుని ప్రకటించారు. అయితే, ఇది షిండేకు నచ్చలేదు. ఆ పదవిని తన పార్టీ నేతకు ఇవ్వాలని కోరారు. అయితే, షిండే అసంతృప్తితో ఈ నియామకాన్ని నిలిపేశారు. గత కొంత కాలంగా షిండే, సీఎం ఫడ్నవీస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!