Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం
- మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకలు..
- శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు.
రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం నిలిపేసిన వారాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది కూటమిలో విభేదాలను మరింతగా పెంచింది. సంరక్షక మంత్రి జిల్లాకు వాస్తవ బాధ్యత వహిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి కమిటీ (DPDC) సమావేశానికి కూడా మంత్రి అధ్యక్షత వహిస్తారు.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
Read Also: Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..
రాయ్గఢ్ లో శివసేనకు చెందిన భరత గోగావాలే ఈ పదవిపై కన్నేశారు. అయితే, రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న ఎన్సీపీకి చెందిన అదితి తత్కరే కూడా ఈ పదవిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో చర్చించకుండా సమావేశం ఎందుకు జరిగిందో ఎన్సీపీ నాయకత్వం సమాధానాలు ఇవ్వాలని షిండే సేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి తమకు తెలియదని శివసేన ఎమ్మెల్యేలు తెలిపారు.
నిజానికి రాయ్గఢ్ జిల్లాలో శివసేన ఆధిపత్యం స్పష్టంగా ఉండటంతో, ఏక్నాథ్ షిండే తన వర్గానికి చెందిన నేతలకు గార్డియన్ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గత నెలలో దావోస్ మీటింగ్కి వెళ్లే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా తత్కరే పేరుని ప్రకటించారు. అయితే, ఇది షిండేకు నచ్చలేదు. ఆ పదవిని తన పార్టీ నేతకు ఇవ్వాలని కోరారు. అయితే, షిండే అసంతృప్తితో ఈ నియామకాన్ని నిలిపేశారు. గత కొంత కాలంగా షిండే, సీఎం ఫడ్నవీస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!