Maharashtra: మహాయుతిలో విభేదాలు.. శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ సమావేశం
- మహారాష్ట్ర మహాయుతి సర్కార్లో లుకలుకలు..
- శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే అజిత్ పవార్ మీటింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని బీజేపీ- అజిత్ పవార్ ఎన్సీపీ- ఏక్నాథ్ షిండే శివసేనల కూటమి ‘‘మహాయుతి’’లో విభేదాలు కనిపిస్తున్నాయి. అధికారిక కూటమిలో వివాదం పెరుగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏక్నాథ్ షిండే శివసేన ఎమ్మెల్యేలు లేకుండానే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో సమావేశం జరిగింది. రాయ్గఢ్ జిల్లా ప్రణాళిక, అభివృద్ధి కమిటీ సమావేశాన్ని అజిత్ పవార్ నిర్వహించారు.
రాయ్గఢ్, నాసిక్ జిల్లాల సంరక్షక నాయకులుగా ఇద్దరు ఎన్సీపీ నాయకుల నియామకాన్ని మహాయుతి ప్రభుత్వం నిలిపేసిన వారాల తర్వాత ఈ సమావేశం జరిగింది. ఇది కూటమిలో విభేదాలను మరింతగా పెంచింది. సంరక్షక మంత్రి జిల్లాకు వాస్తవ బాధ్యత వహిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్న జిల్లా ప్రణాళిక మరియు అభివృద్ధి కమిటీ (DPDC) సమావేశానికి కూడా మంత్రి అధ్యక్షత వహిస్తారు.
Also Read
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
- CM Vijay Removes White Towel: బ్రిటిష్ విఐపి సంస్కృతికి చెక్ పెట్టిన సీఎం విజయ్.. కుర్చీ నుంచి వైట్ టవల్ తొలగింపు
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
Read Also: Supreme Court: EVM లోని డేటాని తొలగించొద్దు.. ఈసీకి సుప్రీం కీలక ఆదేశాలు..
రాయ్గఢ్ లో శివసేనకు చెందిన భరత గోగావాలే ఈ పదవిపై కన్నేశారు. అయితే, రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిగా ఉన్న ఎన్సీపీకి చెందిన అదితి తత్కరే కూడా ఈ పదవిపై దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేలతో చర్చించకుండా సమావేశం ఎందుకు జరిగిందో ఎన్సీపీ నాయకత్వం సమాధానాలు ఇవ్వాలని షిండే సేన ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఈ సమావేశం గురించి తమకు తెలియదని శివసేన ఎమ్మెల్యేలు తెలిపారు.
నిజానికి రాయ్గఢ్ జిల్లాలో శివసేన ఆధిపత్యం స్పష్టంగా ఉండటంతో, ఏక్నాథ్ షిండే తన వర్గానికి చెందిన నేతలకు గార్డియన్ మినిస్టర్ పదవి ఇవ్వాలని కోరుతున్నారు. గత నెలలో దావోస్ మీటింగ్కి వెళ్లే సమయంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా తత్కరే పేరుని ప్రకటించారు. అయితే, ఇది షిండేకు నచ్చలేదు. ఆ పదవిని తన పార్టీ నేతకు ఇవ్వాలని కోరారు. అయితే, షిండే అసంతృప్తితో ఈ నియామకాన్ని నిలిపేశారు. గత కొంత కాలంగా షిండే, సీఎం ఫడ్నవీస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
తాజావార్తలు
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..