Boycott Turkey: ముంబై ఎయిర్పోర్టు దగ్గర శివసేన ఆందోళన.. టర్కీ సంస్థను రద్దు చేయాలని డిమాండ్
- ముంబై ఎయిర్పోర్టు దగ్గర శివసేన ఆందోళన
- టర్కీ సంస్థను రద్దు చేయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టర్కీపై భారతీయుల బాయ్కట్ ఉద్యమం కొనసాగుతోంది. ఇప్పటికే టర్కీ ఉత్పత్తులను.. పర్యాటకరంగాన్ని నిషేధించారు. ఇలా ఒక్కొక్కటిగా టర్కీకి సంబంధించిన వాటిపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా ముంబై ఎయిర్పోర్టు దగ్గర శివసేన నేతలు ఆందోళన చేపట్టారు. టర్కిష్ సంస్థకు సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు 10 రోజులు అల్టిమేటం విధించారు. టర్కిష్ సంస్థ మన దగ్గర డబ్బు సంపాదించి పాకిస్థాన్కు సాయం చేయడానికి ఉపయోగిస్తుందని శివసేన నాయకులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Donald Trump: భారత్లో ఆపిల్ ప్లాంట్లు పెట్టడం మాకు ఇష్టం లేదు: టిమ్కుక్తో ట్రంప్..
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
టర్కీకి చెందిన గ్రౌండ్-హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ ఎన్ఏఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ పనులు చేస్తుంది. 70 శాతం పనులు నిర్వహిస్తోంది. ప్రయాణికుల నిర్వహణ, విమాన కార్యకలాపాలు, కార్గో లాజిస్టిక్స్ పనులను నిర్వహిస్తోంది. అయితే గురువారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర నిరసన చేపట్టారు. వెంటనే టర్కీ సంస్థ సర్వీసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ నేతృత్వంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు 10 రోజులు అల్టిమేటం విధించారు.
ఇది కూడా చదవండి: CPI General Secretary D Raja: ఇండియాపై ట్రంప్ పెత్తనమేంటి..?
జాతీయ భద్రత నేపథ్యంలో టర్కీ సంస్థ సర్వీసులను రద్దు చేయాలని ఎయిర్పోర్టు ఆఫీసర్కు ఎమ్మెల్యే ముర్జీ పటేల్ లేఖ రాశారు. 10 రోజుల్లో ఈ నిర్ణయం తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. తక్షణమే అనుమతులు నిలిపివేయాలని.. లేదంటే రద్దు చేయాలంటూ కోరారు. సెలెబి కార్యకలాపాలను తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కోరారు. తమ డిమాండ్ నేరవేరకపోతే 10 వేల మంది కార్యకర్తలతో తీవ్ర నిరసన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు. అలాగే హిమాచల్ప్రదేశ్లో టర్కిష్ ఆపిల్ దిగుమతులు నిషేధించాలని ప్రధాని మోడీకి కూడా లేఖ రాశారు.
ఇటీవల భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సమయంలో పాకిస్థాన్కు టర్కీ ఆయుధాలు సరఫరా చేసింది. ఈ వ్యవహారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. టర్కీని నిషేధించాలని భారతీయులు నిర్ణయం తీసుకున్నారు.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!