Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు
- మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు..
- బీజీపీకి దూరంగా ఉంటున్న హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే..
- ఏక్నాథ్ షిండే పార్టీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించిన సీఎం ఫడ్నవిస్
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించబడినప్పటికీ, శివసేన నుంచి వచ్చిన వారి కంటే ఈ సంఖ్య చాలా తక్కువ ఉంది.
Read Also: Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!
Also Read
- Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
- IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
- PM Modi: మే 4న అటవిక పాలనకు డెత్ డే.. టీఎంసీ గూండాలను తరిమికొడతామన్న మోడీ
- Monsoon Season: రుతుపవనాల రాకపై తీపికబురు.. ఎంట్రీ ఇచ్చేది ఎప్పుడంటే..!
అయితే, రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మంత్రులు కాకపోయినా, ఈ ఎమ్మెల్యేలకు అదనపు ప్రయోజనంగా వై-భద్రతా మంజూరు చేయబడంతోనే ఈ తొలగింపులు జరిపినట్లు టాక్. 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పతనానికి దారితీసింది. దీంతో పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రతను మహారాష్ట్ర సర్కార్ కేటాయించింది.
Read Also: MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
ఇక, ఈ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే, బీజేపీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. తాజా చర్యతో సీఎం ఫడ్నవీస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, దావోస్ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి ఎన్సీపీకి చెందిన తత్కరే (శ్రీవర్ధన్)ను రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా నియమించారు. దీంతో రాయ్గఢ్, నాసిక్లకు సంరక్షక మంత్రి పదవుల కోసం బీజేపీ, షిండే పార్టీల మధ్య ప్రారంభమైన ప్రతిష్టంభన – ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమిలో స్పష్టంగా విభేదాలు కనిపిస్తుండటపై శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం పదవి రాకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఫడ్నవీస్తో వేదిక పంచుకోవడానికి ఏక్నాథ్ షిండే దూరంగా ఉంటున్నట్లు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!
-
Mutual Funds: ఓ వైపు స్టాక్ మార్కెట్ పడిపోతున్నా.. విపరీతంగా పెరుగుతున్న SIP ఖాతాలు..
-
Raghav Chadha: ఆప్కు రాఘవ్ చద్దా భారీ షాక్.. ఏకంగా ఏడుగురు ఎంపీలు బీజేపీలోకి..
-
Sensex Crash: కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ! దలాల్ స్ట్రీట్లో ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు లాస్..
-
Redmi Note 17 Pro Max: 200MP కెమెరా + 10,000mAh బ్యాటరీ.. Redmi Note 17 Pro Max షాక్ ఇస్తున్న లీక్లు
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!