Maharashtra: మహాయుతి కూటమిలో చీలిక.. షిండే ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ తగ్గింపు
- మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు..
- బీజీపీకి దూరంగా ఉంటున్న హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే..
- ఏక్నాథ్ షిండే పార్టీ ఎమ్మెల్యేలకు భద్రతను తగ్గించిన సీఎం ఫడ్నవిస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: మహారాష్ట్రలోని అధికార మహాయుతి కూటమిలో చీలికలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు చెందిన 20 మంది ఎమ్మెల్యేలకు ఉన్న వై కేటగిరి సెక్యూరిటీని ఉపసంహరించుకున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలకు భద్రతాను కూడా తగ్గించబడినప్పటికీ, శివసేన నుంచి వచ్చిన వారి కంటే ఈ సంఖ్య చాలా తక్కువ ఉంది.
Read Also: Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుడికి అస్వస్థత.. చికిత్స పొందుతూ మృతి!
Also Read
- Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
- Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
అయితే, రాష్ట్ర వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి సీఎం ఫడ్నవీస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. మంత్రులు కాకపోయినా, ఈ ఎమ్మెల్యేలకు అదనపు ప్రయోజనంగా వై-భద్రతా మంజూరు చేయబడంతోనే ఈ తొలగింపులు జరిపినట్లు టాక్. 2022లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి విడిపోవడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం పతనానికి దారితీసింది. దీంతో పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలకు పటిష్ట భద్రతను మహారాష్ట్ర సర్కార్ కేటాయించింది.
Read Also: MouniRoy : బికినీలో మౌని రాయ్.. మాములుగా లేదోయ్..
ఇక, ఈ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే, బీజేపీ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. తాజా చర్యతో సీఎం ఫడ్నవీస్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చేసిన వ్యూహాత్మక ఎత్తుగడగా కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, దావోస్ పర్యటనకు ముందు ముఖ్యమంత్రి ఎన్సీపీకి చెందిన తత్కరే (శ్రీవర్ధన్)ను రాయ్గఢ్ సంరక్షక మంత్రిగా నియమించారు. దీంతో రాయ్గఢ్, నాసిక్లకు సంరక్షక మంత్రి పదవుల కోసం బీజేపీ, షిండే పార్టీల మధ్య ప్రారంభమైన ప్రతిష్టంభన – ఇప్పటికీ పరిష్కారం కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమిలో స్పష్టంగా విభేదాలు కనిపిస్తుండటపై శివసేన (UBT) ఎంపీ ప్రియాంక చతుర్వేది తీవ్ర విమర్శలు గుప్పించింది. సీఎం పదవి రాకపోవడంతో షిండే అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఫడ్నవీస్తో వేదిక పంచుకోవడానికి ఏక్నాథ్ షిండే దూరంగా ఉంటున్నట్లు ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Peddi vs Drishyam : మోహన్ లాల్కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
-
Tecno Pova 8: టెక్నో పోవా 8 రిలీజ్ కు రెడీ.. 8000mAh బ్యాటరీ.. గేమింగ్, మల్టీమీడియా యూజర్లకు బెస్ట్!
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!