Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
- మహారాష్ట్రకు పాకిన ‘‘హిందీ వివాదం’’..
- రాజ్ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసే అవకాశం..
- మరాఠీ కోసం విభేదాలు పక్కన పెట్టాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
2005లో ఠాజ్ ఠాక్రే సొంత పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఏర్పాటు తర్వాత ఠాక్రే కుటుంబం విడిపోయింది. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) లకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు నాయకులు వేర్వేరు కార్యక్రమాలలో మాట్లాడుతూ, మహారాష్ట్ర భాషా , సాంస్కృతిక ప్రయోజనాలు రాజకీయ శత్రుత్వాలకు అతీతమైనవని అన్నారు.
Also Read
- PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
- Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
నటుడు-చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్తో పాడ్కాస్ట్ సందర్భంగా బంధువుల మధ్య పునఃకలయిక అవకాశం గురించి అడిగినప్పుడు.. తనకు, తన బంధవులకు మధ్య విభేదాలు చిన్నవని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవని రాజ్ ఠాక్రే అన్నారు. ‘‘ఉద్ధవ్ , నా మధ్య వివాదాలు, తగాదాలు చిన్నవి. మహారాష్ట్ర వాటన్నిటి కంటే చాలా పెద్దది. ఈ తేడాలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ఉనికికి ప్రమాదంగా మారుతున్నాయి. కలిసి రావడం కష్టం కాదు, ఇది సంకల్పానికి సంబంధించిన విషయం. ఇది నా కోరిక లేదా స్వార్థం గురించి మాత్రమే కాదు, మనం పెద్దగా ఆలోచించాలి. రాజకీయ పార్టీలలోని అందరు మరాఠీ నేతలు ఐక్యమై ఒకే పార్టీని ఏర్పాటు చేయాలి’’ అని అన్నారు.
Read Also: Samantha: తిరుమలలో డిక్లరేషన్ సమర్పించి శ్రీ వారి దర్శనానికి సమంత
2005లో తాను శివసేనతో విడిపోవడం, 2022లో శివసేన నుంచి ఏక్నాథ్ షిండే విడిపోవడానికి తేడాలను రాజ్ ఠాక్రే వివరించారు. ‘‘ఎమ్మెల్యేలు, ఎంపీలు నాతో ఉన్నప్పటికీ నేను శివసేనను విడిచిపెట్టాను. అయినప్పటికీ, బాలా సాహెబ్ ఠాక్రే తప్ప మరెవరి కింద పనిచేయలేదు. నేను ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నానున. ఉద్ధవ్లో కలిసి పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇక్కడ ప్రశ్నేంటంటే మరొకవైపు తాతో కలిసి పనిచేసే సంకల్పం ఉందా..?’’ అని రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర మనం కలిసి రావాలని కోరుకుంటే, మహారాష్ట్రని మాట్లాడనివ్వండి అని, ఇలాంటి విషయంలో తన అహం అడ్డురాదని చెప్పారు.
మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. సయోధ్యకు షరతులతో కూడిన సంసిద్ధతను వ్యక్తం చేశారు. చిన్ని చిన్న వివాదాలను పక్కన పెట్టడానికి నేను సిద్ధం. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రోజు వారికి, మరో రోజు వేరే వారికి మద్దతు ఇవ్వడానికి తాము వ్యతిరేకం’’ అని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినైనా తాను స్వాగతించనని ఆయన అన్నారు.
అన్ని మరాఠీ మరియు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల వరకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలనే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి ఇద్దరు నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేసిన సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రారంభించిన ఈ విధానాన్ని రెండు పార్టీలు మరాఠీ భాషకు అవమానంగా భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Deewana OTT Deal: కంటెంట్పై నమ్మకం.. నిర్మాతలకు రూ.7 కోట్ల జాక్పాట్!
-
Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
-
Kiran Abbavaram: థియేటర్ల నుంచి బయటకొచ్చాక నెలల తరబడి గుర్తుంటుంది.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం ప్రామిస్!
-
CM Chandrababu: సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల్లో ఒకరు సేఫ్.. రంగంలోకి సీఎం చంద్రబాబు..!
-
Vaibhav Sooryavanshi: ‘మీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోను’.. తొలి మ్యాచ్ తర్వాత వైభవ్ ఎమోషనల్ సందేశం..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!