Eknath Shinde: హిందుత్వ, బాలాసాహెబ్ సిద్ధాంతాలను ఉద్ధవ్ ఠాక్రే వదిలేశాడు..
- వక్ఫ్ బిల్లుకు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ వ్యతిరేకంగా ఓటు..
- హిందుత్వాన్ని వదిలేశాడంటూ ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: హిందుత్వ సిద్ధాంతాలకు కేరాఫ్గా ఉన్న శివసేన(యూబీటీ), ఉద్ధవ్ ఠాక్రే క్రమక్రమంగా ఈ సిద్ధాంతాలను వదిలేస్తుందని శివసేన(షిండే) నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా, శివసేన చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన ఉద్ధవ్, హిందుత్వాన్ని, బాలాసాహెబ్ ఠాక్రే వారసత్వాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించడం ద్వారా ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వాన్ని, బాలాసాహెబ్ ఠాక్రే ఆదర్శాలకు పూర్తిగా వెన్నుపోటు పొడిచారని షిండే అన్నారు. ఉద్ధవ్ వైఖరి అతడి సైద్ధాంతిక గందరగోళాన్ని బహిర్గతం చేయడంతో పాటు, అతడి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కప్పేసిందని షిండే అన్నారు. వక్ఫ్ బిల్లుపై ఠాక్రే వైఖరి, ఆ పార్టీ నేతల్ని కూడా నిరాశ పరిచిందని అన్నారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
READ ALSO: Kidney Health: ఈ పద్ధతులు మార్చుకోకపోతే కిడ్నీలు మార్చుకోవాల్సిందే!
బిల్లుపై తన వ్యతిరేకతకు హిందుత్వతో కారణం లేదని, కానీ బీజేపీ కపటత్వాన్ని వ్యతిరేకించడం మాత్రమే అని శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఆయన సైద్ధాంతిక అస్థిరతను వెల్లడిస్తుందని షిండే అన్నారు. ‘‘ఉద్ధవ్ పరిస్థితి ఎలా ఉందంటే అతడు దేనైనా పట్టుకుంటే అది కాటేస్తుంది, విడిచిపెడితే పారిపోతుంది’’ అని షిండే ఎద్దేవా చేశారు.
బాలాసాహెబ్ ఠాక్రే ఎప్పుడూ జాతీయవాద ముస్లింలు, దేశ వ్యతిరేక శక్తుల మధ్య తేడాలను గుర్తించారని, శివసేన బీజేపీ కూడా నిరంతరం ఈ విధానాన్ని సమర్థించాయని షిండే అన్నారు. రాహుల్ గాంధీ ప్రభావంతో ఉద్ధవ్ ఠాక్రే మహ్మద్ అలీ జిన్నాలా మారుతున్నారని దుయ్యబట్టారు. హిందుత్వం పట్ల తన పార్టీ శివసేన బాలా సాహెబ్ ఠాక్రే, ధర్మవీర్ ఆనంద్ దిఘే దార్శనికతకు కట్టుబడి ఉంటుందని షిండే ప్రకటించారు. ఉద్ధవ్ ఠాక్రే 2019లో కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న దాని కన్నా అతిపెద్ద ద్రోహం వక్ఫ్ బిల్లు విషయంలో చేశారని షిండే అన్నారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!