Home
Scrub Typhus
Scrub Typhus News
-
Scrub Typhus: తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..
Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. -
Scrub Typhus: స్క్రబ్ టైఫస్పై ఆందోళన అవసరం లేదు.. సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం..!
Scrub Typhus: ఏపీలో రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వ్యాపిస్తున్న భయాందోళనలను తొలగించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి కాదని, ప్రతి సంవత్సరం మలేరియా, డెంగీ లాగే సుమారు 1300 నుంచి 1600 కేసులు నమోదవుతూ ఉంటాయని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1566 కేసులు నమోదయ్యాయని, గత సంవత్సరం 1613 కేసులు ఉన్నాయని తెలిపారు. స్క్రబ్ టైఫస్ వల్ల… -
Scrub Typhus Ravaging AP: ఏపీని వణికిస్తున్న స్రబ్ టైఫన్.. నాలుగుకు చేరిన మృతుల సంఖ్య
Scrub Typhus Ravaging AP: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరిగింది. పురుగు కుట్టడం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి కారణంగా రాష్ట్రంలో భయాందోళన వాతావరణం నెలకొంది. తాజాగా మరో వ్యక్తి మృతి చెందడంతో, స్క్రబ్ టైఫస్ కారణంగా సంభవించిన మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ తాజా మృతి కృష్ణా జిల్లాలో నమోదైంది. ఉయ్యూరు మండలం, మొదునూరు గ్రామానికి చెందిన 44 ఏళ్ల వ్యక్తి శివశంకర్, స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణించారు. ఈ… -
Scrub Typhus: స్క్రబ్ టైఫస్ కేసుల విషయంలో ఆందోళన.. నివారణతో ప్రాణాపాయం..
ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం. స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో… -
Scrub Typhus: “స్క్రబ్ టైఫస్” కారణంగా హిమాచల్లో మొదటి మరణం..
Scrub Typhus: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఆ రాష్ట్రంలో తొలి మరణం సంభవించినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. -
Scrub Typhus: మహారాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం… రాష్ట్రంలో ప్రవేశించిన స్క్రబ్ టైఫస్
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి.… -
Scrub Typhus: ఒడిశాను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. కొత్తగా 11 కేసులు
Scrub Typhus: ఒడిశా రాష్ట్రాన్ని ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి కలవరపెడుతోంది. తాజాగా సుందర్ఘర్ జిల్లాలో మరో 11 కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో ఆ జిల్లాలో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 180కి చేరింది. తాజాగా 59 శాంపిళ్లను పంపించగా 11 మందికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ గా తేలింది. ఎక్కువగా కేసులన్నీ సుందర్ఘర్ జిల్లాలో నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ తెలిపారు. -
Scrub Typhus: బెంగాల్లో ప్రబలుతున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో… -
Scrub Typhus: బెంగాల్ లో స్క్రబ్ టైఫస్ వ్యాధి కల్లోలం… పెరుగుతున్న బాధితులు
కరోనా, మంకీపాక్స్ ఇలా ప్రపంచాన్ని ఏదో ఓ వ్యాధి కలవరపెడుతూనే ఉంది. కరోనా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం కలిగిస్తుంటే.. ప్రస్తుతం మంకీపాక్స్ వైరస్ తో మరో ముప్పు ప్రపంచం ముందర ఉంది. ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో మాత్రం స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరాలు వణికిస్తున్నాయి. ఈ స్క్రబ్ టైఫస్ జ్వరాలతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఏడాది బెంగాల్ మే నాటికి దాదాపుగా 60కి పూగా స్క్రబ్…
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!