Scrub Typhus: స్క్రబ్ టైఫస్ కేసుల విషయంలో ఆందోళన.. నివారణతో ప్రాణాపాయం..
- ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి
- చిన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందన్న డాక్టర్లు
- సరైన టైంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో ఉండే చిన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందని డాక్టర్లు తెలిపారు. మనుషుల నుంచి మనుషులకు ఇది నేరుగా వ్యాపించదని డాక్టర్లు చెబుతున్నారు. నల్లి కుట్టిన చోట మొదట ఒక నల్లటి మచ్చ లేదా దద్దురులాంటి గుర్తులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
- Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
- WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
- Rajasthani Khoba Roti Recipe: రెగ్యులర్ రోటీ బోర్ కొట్టిందా..? ఈ కరకరలాడే ప్రత్యేక వంటకం ట్రై చేయండి..
స్క్రబ్ టైఫస్ తో ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన జ్వరం వస్తుందని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చలు లేదా దద్దురు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు, పొడి దగ్గు, తీవ్రమైన నీరసం, బలహీనత ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చికిత్స ఆలస్యం అయితే మరణాల రేటు 30% వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
స్క్రబ్ టైఫస్ తీవ్రత ఎక్కువైతే కిడ్ని సమస్యలు, శ్వాసకోసం సంబంధ సమస్యలు, రక్తపోటు పడిపోవడం, నర్వస్ సిస్టం ఇన్ఫెక్షన్లు, కోమాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం కేవలం 2% వరకు మాత్రమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ఎక్కువగా పొలాల్లో పనిచేవారికి, పశువులను చూసుకునే వారికి, పచ్చిక, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎవరికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పచ్చిక, పొదల్లో తిరిగేటప్పుడు పొడవైన దుస్తులు ధరించాలని వైద్యులు తెలిపారు. ఇంటి చుట్టుపక్కల చెత్త, అదుపు తప్పిన పొదలను శుభ్రం చేయాలి.నల్లి పెరిగే తేమ వాతావరణాన్ని నివారించాలి.శరీరంపై నల్లటి మచ్చ, దద్దుర్లు, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.ఈ సమాచారం అంతా.. మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీరు వీటిని ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!