Scrub Typhus: స్క్రబ్ టైఫస్ కేసుల విషయంలో ఆందోళన.. నివారణతో ప్రాణాపాయం..
- ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి
- చిన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందన్న డాక్టర్లు
- సరైన టైంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదన్న నిపుణులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. చిన్న నల్లి ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అంటే ఏమిటి, దాని లక్షణాలు, ప్రమాదాలు, జాగ్రత్తలు అన్న విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం అత్యవసరం.
స్క్రబ్ టైఫస్ అనేది ‘ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధి. ఇది ముఖ్యంగా పచ్చిక బయళ్లలో, పొదల్లో ఉండే చిన్న నల్లులు కుట్టడం ద్వారా మనుషులకు సోకుతుందని డాక్టర్లు తెలిపారు. మనుషుల నుంచి మనుషులకు ఇది నేరుగా వ్యాపించదని డాక్టర్లు చెబుతున్నారు. నల్లి కుట్టిన చోట మొదట ఒక నల్లటి మచ్చ లేదా దద్దురులాంటి గుర్తులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్తో మీ కుర్చీలకు కొత్త లుక్!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
స్క్రబ్ టైఫస్ తో ఆకస్మికంగా వచ్చే తీవ్రమైన జ్వరం వస్తుందని నిపుణులు తెలిపారు. అంతే కాకుండా నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చలు లేదా దద్దురు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు, పొడి దగ్గు, తీవ్రమైన నీరసం, బలహీనత ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అయితే సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించకపోతే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చికిత్స ఆలస్యం అయితే మరణాల రేటు 30% వరకు పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
స్క్రబ్ టైఫస్ తీవ్రత ఎక్కువైతే కిడ్ని సమస్యలు, శ్వాసకోసం సంబంధ సమస్యలు, రక్తపోటు పడిపోవడం, నర్వస్ సిస్టం ఇన్ఫెక్షన్లు, కోమాలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డాక్టర్లు వెల్లడించారు. అయితే లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స తీసుకుంటే ప్రమాదం కేవలం 2% వరకు మాత్రమే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఇది ఎక్కువగా పొలాల్లో పనిచేవారికి, పశువులను చూసుకునే వారికి, పచ్చిక, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నివసించే వారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎవరికి ఎక్కువగా సోకే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పచ్చిక, పొదల్లో తిరిగేటప్పుడు పొడవైన దుస్తులు ధరించాలని వైద్యులు తెలిపారు. ఇంటి చుట్టుపక్కల చెత్త, అదుపు తప్పిన పొదలను శుభ్రం చేయాలి.నల్లి పెరిగే తేమ వాతావరణాన్ని నివారించాలి.శరీరంపై నల్లటి మచ్చ, దద్దుర్లు, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.ఈ సమాచారం అంతా.. మేము ఇంటర్నెట్ నుంచి గ్రహించాం. కావున మీరు వీటిని ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
Government Schools Decline: ఒకే ఏడాదిలో 9,900 ప్రభుత్వ పాఠశాలల మూత… తెలుగు రాష్ట్రాల్లో భారీగా..! కారణమేంటి?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
ట్రెండింగ్
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!