Home
Savitri
Savitri News
-
Mayabazar completes 65 years : మది దోచిన మహత్తర చిత్రం మాయాబజార్!
(మార్చి 27న మాయాబజార్కు 65 ఏళ్ళు పూర్తి)మహానటుడు యన్.టి.రామారావును అపర శ్రీకృష్ణునిగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా దిగ్దర్శకులు కే.వి.రెడ్డికే దక్కుతుంది. అసలు యన్టీఆర్ లో శ్రీకృష్ణుడు దాగున్నాడన్న సత్యాన్ని గ్రహించిన తొలి వ్యక్తి దర్శక నిర్మాత ఎఫ్.నాగూర్ అన్న విషయం ఎంతమందికి తెలుసు? 1954లోనే నాగూర్ తెరకెక్కించిన ఇద్దరు పెళ్ళాలు చిత్రంలో ఓ స్వప్నగీతంగా దర్శనమిచ్చే మదిలో హాయి... కలలే వేయి... విరిసేనీ రేయి గోపాలబాల... అంటూ సాగే పాటలో యన్టీఆర్ తొలిసారి తెరపై శ్రీకృష్ణుని గెటప్… -
యాభై ఐదేళ్ళ ‘కంచుకోట’
(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద… -
Pelli Chesi Chudu: యన్టీఆర్ ‘పెళ్ళి చేసి చూడు’కు 17 ఏళ్ళే!
నందమూరి తారక రామారావును ఏ ముహూర్తాన ‘నటరత్న’ అన్నారో, ఎవరు ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని దీవించారో కానీ, ఆయన ఆ బిరుదులకు అన్ని విధాలా అర్హులు! అంతేనా ఆయన నటజీవితంలో అన్నీ ఎవరో అమర్చినట్టుగానూ జరిగిపోయాయి. తెలుగునాట హీరోగా వంద చిత్రాలను, రెండు వందల సినిమాలను అతివేగంగా పూర్తి చేసిన ఘన చరిత్ర ఆయన సొంతమే! ఇక ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక, జానపద చిత్రాలో కథానాయకునిగా వెలుగొందిన ఘనత కూడా ఆయన పాలే! మన దేశంలో అత్యధిక… -
అరవై ఏళ్ళ ‘ఆరాధన’
(ఫిబ్రవరి 16న ఏయన్నార్ ‘ఆరాధన’కు 60 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ అధినేత వి.బి.రాజేంద్రప్రసాద్ కు ఉన్న అనుబంధం ఎనలేనిది. జగపతి బ్యానర్ లో ఏయన్నార్ నటించిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. ఆ సంస్థ లో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం ‘ఆరాధన’. 1962 ఫిబ్రవరి 16న ఈ చిత్రం విడుదలయింది. ఈ చిత్రం ‘సాగరిక’ అనే బెంగాలీ సినిమా ఆధారంగా రూపొందింది. రీమేక్స్ తీయడంలో మేటి అని తరువాతి రోజుల్లో పేరు… -
నటరత్నతో నటీశిరోమణి బంధం!
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)మహానటి సావిత్రి హిట్ పెయిర్ ఎవరు అన్న సంశయం అప్పట్లో చాలామందికి కలిగేది. తమిళనాట ఆమె భర్త జెమినీగణేశన్ ఆమె హిట్ పెయిర్ అని తేల్చేశారు. తెలుగునాట ఆమెకు సరైన జోడీ అంటే యన్టీఆర్ అని కొందరు, కాదు ఏయన్నార్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నిజానికి ఆమె నటజీవితంలో జెమినీ గణేశన్, ఏయన్నార్ కంటే యన్టీఆర్ తోనే అనుబంధం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అసలైన హిట్ పెయిర్సావిత్రి తొలిసారి తెరపై కనిపించిన చిత్రం… -
నటసమ్రాట్ తో మహానటి
(డిసెంబర్ 6న సావిత్రి జయంతి)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులోని అసలైన నటుణ్ణి వెలికి తీసిన చిత్రం దేవదాసు (1953). ఈ చిత్రంలో దేవదాసు పాత్రతో పోటీ పడి పార్వతి పాత్రలో జీవించారు సావిత్రి. అంతకు ముందు 1950లో ఏయన్నార్ ను టీజ్ చేస్తూ సంసారం చిత్రంలో ఓ పాటలో తళుక్కుమన్నారు సావిత్రి. ఆ తరువాత అదే ఏయన్నార్ కు సావిత్రి విజయనాయికగా మారడం విశేషం! సావిత్రితో ఏయన్నార్ నటించిన తొలి చిత్రం దేవదాసు. అయితే దాని కంటే ముందుగా… -
40 ఏళ్ళ ‘మహాపురుషుడు’
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి… -
ఆడవాళ్లు మీకు జోహార్లు: ‘నవరాత్రి స్పెషల్’ వీడియోతో రాధికా
దేశవ్యాప్తంగా విజయ దశమి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దసరాగా పిలవబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కోరోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు. ఈ ‘నవరాత్రి స్పెషల్’ డే ను పురస్కరించుకొని ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్న సీనియర్ నటి రాధికా, ఊర్వశి ఓ వీడియోను పంచుకున్నారు. ఈ ‘నవరాత్రి.. శుభరాత్రి..’ అంటూ కథానాయికగా నటిస్తున్న రష్మిక మందానతో అలనాటి సావిత్రిని తపిస్తూ వీడియో… -
ఆగస్టులో ‘సావిత్రి w/o సత్యమూర్తి’
అరవైయేళ్ల మహిళకు పాతికేళ్ల కుర్రాడు ఎలా భర్త అయ్యాడు? వాళ్లిద్దరూ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? జీవితాంతం కలిసుండాలని ఎలా నిర్ణయించుకున్నారు? అనే కథాంశంతో రూపొందుతున్న స్వచ్ఛమైన వినోదాత్మక కుటుంబకథా చిత్రం ‘సావిత్రి వైఫ్ ఆఫ్ సత్యమూర్తి’. పాతికేళ్ల కుర్రాడిగా ‘కేరింత’ ఫేమ్ పార్వతీశం, అతని భార్య పాత్రలో అరవైయేళ్ల మహిళగా హాస్యనటి శ్రీలక్ష్మి వెండితెరపై సందడి చేయనున్నారు. గోగుల నరేంద్ర నిర్మిస్తున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ శిష్యుడు చైతన్య కొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిర్మాత గోగుల…
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!