యాభై ఐదేళ్ళ ‘కంచుకోట’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(మార్చి 22తో ‘కంచుకోట’కు 55 ఏళ్ళు పూర్తి)
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, నటరత్న యన్.టి.రామారావు అత్యధిక జానపద చిత్రాలలో కథానాయకునిగా నటించి అలరించారు. ఆయన నటించిన అనేక జానపదాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక పంపిణీదారులకు, ప్రదర్శనశాలల వారికి యన్టీఆర్ జానపద చిత్రాలే కామధేనువుగా నిలిచాయి. ఆ రోజుల్లో ఏ థియేటర్ లోనైనా సినిమా లేకపోతే, వెంటనే యన్టీఆర్ జానపద చిత్రం వేసుకొనేవారు. సదరు చిత్రాలు రిపీట్ రన్స్ లోనూ విశేషాదరణ చూరగొనేవి. రిపీట్ రన్ లోనూ ఓ జానపద చిత్రం వంద రోజులు మూడు ఆటలతో ఆడడం అంటే అప్పట్లోనే కాదు, ఇప్పటికీ అద్భుతం అనిపిస్తుంది. అలాంటి చరిత్ర సృష్టించిన చిత్రం యన్టీఆర్ నటించిన ‘కంచుకోట’. 1967 మార్చి 22న విడుదలైన ఈ జానపద చిత్రం అప్పటికి వెలుగు చూసిన ఇతర జానపదాలకన్నా భిన్నంగా రూపొంది విశేషాదరణ చూరగొంది. శతదినోత్సవాలు చేసుకుంది. 1975లో ‘కంచుకోట’ హైదరాబాద్ లో మూడు ఆటలతో శతదినోత్సవం జరుపుకోవడం ఈ నాటికీ విశేషంగా ముచ్చటించుకుంటారు.
‘కంచుకోట’ కథ విషయానికి వస్తే – చంద్రగిరి ప్రాంతాన్ని దోపిడీ దొంగలు దోచుకుంటారు. ఆ ఊరివాడయిన సురేంద్రుడు ఆ సమయంలో వేరే చోట ఉంటాడు. విషయం తెలుసుకొని, ఈ అఘాయిత్యాన్ని రాజు దృష్టికి తీసుకువెళ్ళాలని కోటకు వెళతాడు. అక్కడ ఎవరూ కనిపించరు. మార్గమధ్యంలో వస్తూ ఉండగా, రాకుమారుడు నరేంద్రుని రక్షిస్తాడు. దాంతో వారిద్దరూ మంచి మిత్రులు అవుతారు. ఇక అడవిలోని జయంతికి, కోటలోని మంత్రి భైరవుని కూతురు మాధవికి మంచి స్నేహం ఉంటుంది. వారిద్దరూ ప్రాణస్నేహితురాళ్ళు. సురేంద్రకు ఓ సమయాన జయంతితో పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారుతుంది. అతణ్ణి ఓ ముసుగు మనిషి వెంబడిస్తాడు. నరేంద్ర తన మిత్రుడు సురేంద్రను తీసుకు వెళ్ళి రాజకోటలో మంచి కొలువు ఇప్పిస్తాడు. సురేంద్రను చూసిన మాధవి తొలి చూపులోనే మనసు పారేసుకుంటుంది. మాధవిని ఆమె బావ అయిన నరేంద్ర ప్రాణప్రదంగా ప్రేమిస్తుంటాడు. తన పుట్టినరోజున జయంతిని కోటకు ఆహ్వానిస్తుంది మాధవి. అదే సమయంలో తాను ప్రేమించిన సురేంద్రను చూపిస్తుంది. జయంతిని కోటలో చూసిన సురేంద్ర ఆశ్చర్యపోతాడు. జయంతి బాధతో అక్కడ నుండి పారిపోతుంది. ఇక ముసుగుమనిషి ఓ సారి నరేంద్రను చంపాలని చూస్తాడు. మళ్ళీ అతని బారి నుండి సురేంద్ర రక్షిస్తాడు. ఆ సమయంలో నరేంద్రను కోటకు చేర్చమని మిత్రుడు భజగోవిందానికి చెబుతాడు. తాను ముసుగుమనిషిని వెంటాడుతాడు సురేంద్ర. ఓ గుహలో ముసుగు మనిషిని అడ్డగిస్తాడు. అప్పుడు అతను తన గతాన్ని చెబుతాడు. అతడు ఓ నాటి భల్లాణ సామ్రాజ్యాధినేత రాజేంద్ర భూపతి తమ్ముడు విజయేంద్ర భూపతి అని తెలుస్తుంది. అతని సొంత బావమరిది భైరవుని కారణంగానే, తన అన్న ప్రాణాలు పోగొట్టుకున్నారని చెబుతాడు. తనకు అవిటి తనం ప్రాప్తించిందనీ అంటాడు. సురేంద్ర తల్లి ఓ నాటి మహారాణి రాజేశ్వరీదేవి అని, సురేంద్రనే భల్లాణ రాజ్యానికి ఉత్తరాధికారి అనీ వివరిస్తాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సురేంద్ర తన కన్నతండ్రిని అంతమొందించిన భైరవుణ్ణి, అతనికి వంతపాడిన మార్తాండను రూపు మాపాలని వెళతాడు. కానీ, అప్పటికీ సురేంద్రను అపార్థం చేసుకున్న నరేంద్ర అతనిపై కత్తి దూస్తాడు. వారి పోరాటం తన వల్లనే అని భావించిన మాధవి ఆత్మహత్య చేసుకుంటుంది. వారిద్దరినీ మంచి మిత్రులుగా ఉండాలని ఆశించి కన్నుమూస్తుంది. తన కూతురు చనిపోయిందని తెలిసి భైరవుడు పిచ్చివాడు అవుతాడు. భైరవుడే మార్తాండునీ చంపేస్తాడు. చివరకు వారి అనుచరులను సురేంద్ర, నరేంద్ర అంతమొందిస్తారు. సురేంద్ర, జయంతి వివాహం, వారి పట్టాభిషేకంతోనూ కథ సుఖాంతమవుతుంది.
Also Read
- Korean Kanakaraju : 'కొరియన్ కనకరాజు' రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్... మరో సర్ప్రైజ్ కూడా
- Peddi Monday Test : ఈ రోజు నుండి 'పెద్ది'కి అసలైన ఆట మొదలు
- Karuppu OTT Update : 300 కోట్ల మాస్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ షురూ!... ఈ వారమే ఓటీటీలోకి సూర్య 'కరుప్పు'
- Janhvi Kapoor : బాలీవుడ్లో అందాల ఆరబోస్తే నీతులు.. సౌత్లో స్కిన్ షో చేస్తే బూతులు?
సురేంద్రగా యన్టీఆర్, నరేంద్రగా కాంతారావు, మాధవిగా సావిత్రి, జయంతిగా దేవిక నటించిన ఈ చిత్రంలో శాంతకుమారి, వాణిశ్రీ, పద్మనాభం, చిత్తూరు నాగయ్య, ధూళిపాల, ప్రభాకర్ రెడ్డి, రాజనాల, రమణారెడ్డి, చదలవాడ, సత్యనారాయణ, కాంచన, ఎల్.విజయలక్ష్మి, జయశ్రీ, టి.జి.కమలాదేవి, నెల్లూరు కాంతారావు, జగ్గారావు నటించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు త్రిపురనేని మహారథి సమకూర్చారు. ఈ సినిమాకు కేవీ మహదేవన్ స్వరకల్పన ఓ ఎస్సెట్. ఇందులోని పాటలను సి.నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు, ఆచార్య ఆత్రేయ, మహారథి పలికించారు. ఈ సినిమాలోని అన్ని పాటలూ ఒక ఎత్తు, “సరిలేరు నీకెవ్వరూ…” అంటూ సాగే పాట ఒక్కటీ ఓ ఎత్తు అని చెప్పవచ్చు. మిగిలిన పాటలు “ఉలికి ఉలికి పడుతోంది…”, “సిగ్గెందుకే చెలీ…”, “లేదు లేదని ఎందుకు నీలో…”, “నీ పుట్టినరోజు…”, “ఈడొచ్చిన పిల్లనోయ్…”, “భమ్ భమ్ భజగోవిందం…”, “అర్దరేతిరి కాడ…” అంటూ సాగే పాటలూ ఆకట్టుకున్నాయి. “ఎచటనో గల స్వర్గంబు…” అనే పద్యం ఘంటసాల గళంలో జాలువారి ఎంతగానో మురిపించింది. 1967 మార్చి 22న విడుదలైన సమయంలో ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. 1975లో హైదరాబాద్ లో వంద రోజలు ఆడిన సమయంలోనూ బాలనగర్ శోభన థియేటర్ లో శతదినోత్సవం చేసుకుంది. అలా ఓ జానపద చిత్రం రెండు సార్లు శతదినోత్సవం జరుపుకోవడం అన్నది ఇప్పటి దాకా మళ్ళీ జరగలేదు.
‘కంచుకోట’ చిత్రం అప్పట్లో వస్తోన్న రామారావు జానపద చిత్రాలకు భిన్నంగా తెరకెక్కింది. ఓ జానపద చిత్రం స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో రూపొందడం కూడా ఆకట్టుకుంది. ఆ తరువాత ఈ సినిమాను అనుకరిస్తూ అనేక జానపద సినిమాలు రూపొందాయి.
తాజావార్తలు
-
BharatPe Flex Feature: భారత్పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
-
Astrology: ఈ 4 రాశులవారు కోపం వచ్చినప్పుడు అసలు కంట్రోల్లో ఉండరట.. మీ రాశి కూడా ఉందా?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!