ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 (IPL 2025) కోసం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులో చేరారు. ఇంగ్లాండ్తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో అతని చూపుడు వేలుకు గాయమైంది. దీంతో.. క్రికెట్ అభిమానులు ఈ సీజన్కు దూరమవుతాడని భావించినప్పటికీ.. గత నెలలో విజయవంతమైన శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో.. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగే తొలి మ్యాచ్లో తన జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్కు భారీ దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడ్డాడు. ఇంగ్లండ్తో ఐదో టీ20లో సంజూ చూపుడు వేలికి గాయమైంది. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్లో బంతి సంజూ చూపుడు వేలుపై బలంగా తాకింది.
ఈరోజు ఇంగ్లాండ్ తో జరిగే ఐదో టీ20 మ్యాచ్కు సంజు శాంసన్ ను పక్కన పెట్టనున్నారు. సంజుకు మరిన్నీ అవకాశాలు ఇవ్వాలని తెలిపిన సంజయ్ మంజ్రేకర్. అతడు ఫాంలోకి వస్తే టీమిండియాకు తిరుగులేదని వెల్లడించారు.
Sanju Samson: ఇంగ్లండ్తో జరుగనున్న వన్డే సిరీస్కి టీమిండియా ఇంకా తమ జట్టును ప్రకటించలేదు. అంతేకాక, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం కూడా జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ త్వరలో సమావేశం నిర్వహించి జట్టును ప్రకటించే అవకాశముంది. అయితే, ఇంగ్లండ్ సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందే వికెట్ కీపర్గా సంజూ శాంసన్కు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం, విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనకపోవడం సంజూ శాంసన్కి ఇబ్బంది కలిగించింది.…
Sanju Samson in syed mushtaq ali trophy: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సర్వీసెస్పై కేరళ కెప్టెన్ సంజు చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో కేరళ విజయం సాధించింది. కేరళ, సర్వీసెస్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన కేరళ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సర్వీసెస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. సర్వీసెస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని కేరళ 18.1 ఓవర్లలో…
దక్షిణాఫ్రికా పర్యటనలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత జట్టును అద్భుతంగా నడిపించాడని టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. సిరీస్ ఆసాంతం కుర్రాళ్లు ప్రదర్శించిన వ్యక్తిత్వం పట్ల తాను గర్వపడుతున్నా అని చెప్పారు. జట్టు ఆడిన తీరు, ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించిన విధానం అద్భుతం అని హైదరాబాద్ సొగసరి చెప్పుకొచ్చారు. దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్ను 3-1తో భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్తో బిజీగా…
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన 4 మ్యాచ్ల్లో 2 సెంచరీలు సాధించాడు. కాగా.. ఈ సిరీస్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. నాల్గవ మ్యాచ్లో అజేయంగా 109 పరుగులు చేశాడు. దీంతో.. టీ20 ఫార్మాట్లో 2024లో జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందున్న విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
సంజూ శాంసన్, తిలక్ వర్మల అజేయ సెంచరీలతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో భారత్ 3-1తో దక్షిణాఫ్రికాను ఓడించింది. వాండరర్స్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో, భారత్ ఒక వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరును సాధించింది, ఆపై దక్షిణాఫ్రికాను 148 పరుగులకు ఆలౌట్ చేసి దక్షిణాఫ్రికాను 135 పరుగులకే ఆలౌట్ చేసింది.
దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. టీ20 ఫార్మాట్లో టీమిండియా సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇదొకటి. టీమ్ ఇండియా ఈ విజయంలో సంజూ శాంసన్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్ అద్భుత ప్రదర్శన చేశారు.
IND vs SA: నేడు టీ20 సిరీస్లో చివరిదైన నాలుగో మ్యాచ్లో భారత్ ఈరోజు (శుక్రవారం) దక్షిణాఫ్రికాను ఢీకొంటుంది. ఇప్పటికే రెండు విజయాలు సాధించినా.. బ్యాటింగ్లో టీమిండియా తడబడుతోంది.