IND vs NZ 1st T20: ఓపెనర్గా శాంసన్, రింకూకు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే!
- జనవరి 21 నుంచి భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్
- నాగ్పూర్లో బుధవారం మొదటి మ్యాచ్
- ఓపెనర్గా శాంసన్, రింకుకు ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమవుతుంది. నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 37 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వన్డే సిరీస్ విజయం అందుకున్న కివీస్.. టీ20 సిరీస్ కూడా కొట్టాలని చూస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ పొట్టి సిరీస్ అయినా పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తొలి టీ20కు బరిలోకి దిగే ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం.
ఈ మ్యాచ్లో సంజూ సాంసన్ ఓపెనర్గా ఆడనున్నాడు. అంతేకాదు వికెట్కీపర్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. యువ ఆటగాడు అభిషేక్ శర్మ మరో ఓపెనర్గా ఆడనున్నాడు. ఈ జోడీ కొంతకాలంగా మంచి ఆరంభాలు ఇస్తున్న విషయం తెలిసిందే. మూడో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యాలు మిడిల్ ఆర్డర్లో ఆడనున్నారు. హార్దిక్ ఆల్రౌండర్గా బ్యాట్తో పాటు బంతితో కూడా జట్టుకు కీలకంగా మారనున్నాడు. ఆల్రౌండర్ విభాగంలో అక్షర్ పటేల్ ఆడనున్నాడు. శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. చివరి ఓవర్లలో ఈ ఇద్దరి దూకుడు టీమిండియాకు కీలకం కానుంది.
Also Read
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
- Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
- Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
Also Read: Tollywood Heros: టాలీవుడ్ కొత్తతరం హీరోలు.. నటులే కాదు స్టోరీ సృష్టికర్తలు కూడా!
బౌలింగ్ విభాగానికి వస్తే.. పేస్ దళానికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడు. అతనికి తోడుగా అర్షదీప్ సింగ్ ఆడనున్నాడు. మూడో పేసర్గా హార్దిక్ పాండ్యా ఆడుతాడు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి కీలకం కానున్నాడు. మొత్తంగా యువ, సీనియర్ ఆటగాళ్లతో కలిపి న్యూజిలాండ్కు టీమిండియా గట్టి సవాల్ విసరడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు కివీస్ కూడా బలంగానే ఉంది. రేపటి తొలి టీ20 మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.
భారత్ తుది జట్టు (అంచనా):
సంజు శాంసన్, అభిషేక్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), శివమ్ దూబే, రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్.
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!