S Jaishankar: ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే, భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు కొంటూనే ఉంది. పలు సందర్భాల్లో యూరప్, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ భారత్ ముడిచమురు కొనడం ఆపలేదు. పలు సందర్భాల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెస్ట్రన్ మీడియాకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు. తాజాగా ఆయన మరోసారి అమెరికా ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఔరా అనిపించారు.
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు.
S Jaishankar: న్యూఢిల్లీలో సంప్రదింపులు లేకుండా ప్రస్తుతం ప్రపంచం ఏ సమస్యపై నిర్ణయం తీసుకోలేదని, భారత్ ప్రపంచంలో చాలా కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. భారత్ మారిందని, ప్రపంచం మనల్ని చూసే దృష్టి కూడా మారిందని ఆయన శనివారం అన్నారు. భారత్ స్వతంత్రంగా ఉండటమే దీనికి కారణమని.. భారత్ వేరొకరి సంస్థలా కాకుండా, తన ప్రయోజనాల కోసం పరస్పరం విభిన్న దేశాలతో కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం దేశంలోని ప్రజలకు ఆధార్, బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, సాంకేతికను ఉపయోగించడం వల్ల వివిధ రంగాల్లో దేశం అద్భుతమైన విజయాలను సాధించడంలో సహాయపడిందని అన్నారు. 10 ఏళ్లలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని భారతదేశం ప్రజల జీవితాలను మార్చడానికి అద్భుతాలు చేసిందని కొనియాడారు. ఆరోగ్యం, నీరు, విద్యుత్, ఇల్లు, విద్య వంటి భారతీయులు ఎదుర్కొనే అనేక సమస్యలు అభివృద్ధి చెందిన దేశాలతో సహా అనేక ఇతర దేశాలలో కూడా ఉన్నాయని అన్నారు.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ విధానాలపై విమర్శనాత్మకంగా స్పందించారు. చైనాతో భారత సంబంధాల విషయంలో మాట్లాడుతూ ఆయన చరిత్రలో జరిగిన అంశాలను గుర్తు చేశారు. ఢిల్లీలో ‘వై భారత్ మాటర్స్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్.. చైనా, పాకిస్తాన్, అమెరికా సంబంధాలను గురించి మాట్లాడారు.
EAM S Jaishankar: భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కెనడా చర్యలను మరోసారి బహిరంగంగా తప్పుపట్టారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు పెద్దపీట వస్తోందని, ఖలిస్తానీ శక్తులకు భారత్-కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అనుమతి ఉందని మంగళవారం ఆయన అన్నారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీలకు చోటు ఇవ్వడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు వారి రాజకీయాలు స్థితి అలా ఉందని వ్యాఖ్యానించారు.
USA: అమెరికాలో మరోసారి ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోయారు. హిందూ ఆలయాన్ని టార్గెట్ చేసి దాడి చేశారు. కాలిఫోర్నియాలో హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన నెవార్క్ నగరంలో చోటు చేసుకుంది. స్వామినారణయ మందిర గోడలపై ఖలిస్తానీ అనుకూల నినాదాలు చేశారు. ఆలయ గోడలపై ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత నినాదాలు చిత్రీకరించారు.
India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.