S Jaishankar: ఇజ్రాయిల్పై హమాస్ దాడి తీవ్రవాదమే.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్బాక్ సమక్షంలో మ్యూనిచ్లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Urvashi Rautela: ఈ డైరెక్టర్.. హాట్ బ్యూటీని వదిలేలా లేడుగా..?
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
అక్టోబర్ 7న ఇజ్రాయిల్పై హమాస్ చేసిన దాడుల్ని ‘ఉగ్రవాదం’గా ఆయన అభివర్ణించారు. అదే సమయంలో ఇజ్రాయిల్ మానవతా సాయాన్ని పాటించాల్సిన అంతర్జాతీయ బాధ్యతను గుర్తుచేశారు. ప్రజల ప్రాణనష్టం పట్ల ఇజ్రాయిల్ జాగ్రత వహించాలని జైశంకర్ సూచించారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై భారత వైఖరిని నాలుగు పాయింట్లలో జైశంకర్ వివరించారు. ఒకటి అక్టోబర్ 7న జరిగిన దాడి ఉగ్రవాదమే అని, రెండోది ఇజ్రాయిల్ ప్రతిస్పందనలో ప్రాణనష్టం గురించి జాగ్రత్త వహించాలని, మూడోది బందీలను విడుదల చేయడం తప్పనిసరి అని, నాలుగవది ఉపశమనం అందించడానికి మానవతా కారిడార్ అవసరమని, దీర్ఘకాలిక పరిష్కారం ఉండాలని సూచించారు. భారతదేశం పాలస్తీనా-ఇజ్రాయిల్ రెండు దేశాల పరిష్కారాన్ని చాలా కాలంగా విశ్వసిస్తోందని చెప్పారు.
అక్టోబర్ 7న జరిగిన ఇజ్రాయిల్పై హమాస్ ఉగ్రవాదులు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 1200 మంది ఇజ్రాయిలీలను చంపేయడంతో పాటు 220 మందిని బందీలుగా కిడ్నాప్ చేసి గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ లోని హమాస్ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 25,000 పైగా మంది మరణించారు. హమాస్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!