India-Canada: కెనడాలో భారత అధికారులను బెదిరించారు.. ఇది మంచి పద్దతి కాదు..
కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు. అందువల్లే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య గత ఏడాది దౌత్యపరమైన విభేదాలు వచ్చాయి. ఫలితంగా గత సెప్టెంబర్లో భారత్ అక్కడ వీసా సేవలను బంద్ చేసింది. ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను వివరిస్తూ జైశంకర్ సోమవారం నాడు ఓ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.
Read Also: Investment : పెద్ద కంపెనీలను వదిలి చిన్న ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు
Also Read
ఇక, శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్, లండన్లోని హైకమిషన్పై దాడులు చేసిన వారితో పాటు కెనడాలో భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బెదిరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ డిమాండ్ చేశారు. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ దశలో మా దేశ దౌత్య కార్యాలయాలపై స్మోక్ బాంబులు కూడా విసిరారని వెల్లడించారు. వారికి అక్కడ అంత స్వేచ్ఛ ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్ స్వేచ్ఛ విస్తరించడం మంచిది కాదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హితవు పలికారు.
Read Also: Ayesha Khan : ఆ స్టార్ హీరో మూవీలో ఆఫర్ కొట్టేసిన అయేషా ఖాన్..
కాగా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఇలాంటిదాడులు జరిగాయనే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గుర్తు చేశారు. తగినంత భద్రత లభించలేదని ఆయన చెప్పారు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి దాడులు జరిగినా చాలా బలమైన ప్రతిస్పందన వస్తుందని పేర్కొన్నారు. ఒక దేశ రాయబార కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తప్పుడు సంకేతాలను పంపిస్తుందని జై శంకర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!