S Jaishankar: పొరుగు దేశాలపై చైనా ప్రభావం.. భారత్ భయపడాల్సిన అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
External Affairs Minister S Jaishankar: భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావం గురించి పోటీ ఉంది, అయితే దీనిని భారత దౌత్య వైఫల్యంగా పేర్కొనడం తప్పు అని జైశంకర్ అన్నారు.
Read Also: MPs Suspension: బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
Also Read
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
- Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
“చైనా కూడా పొరుగు దేశమని, పోటీ రాజకీయాలలో భాగంగా ఈ దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని మనం గుర్తించాలి. మనం చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనం ఓకే చెప్పాలని అనుకుంటున్నాను, ప్రపంచ రాజకీయాలు ఒక పోటీ ఉన్న ఆట. మీరు మీ వంతు కృషి చేయండి, నేను నా వంతు కృషి చేస్తాను” అని మంత్రి జై శంకర్ అన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినందున, చైనా వనరులను మోహరిస్తుంది. దాని మార్గంలో విషయాలను మలచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయాల్లోనే పోటీకి మనం భయపడకూదని.. పోటీని స్వాగతించాలని, పోటీ చేయగలనని చెప్పాలని అన్నారాయన.
Read Also: Rahul Gandhi: నితీష్ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్
పొరుగు దేశాలకు సహాయం చేయడంలో భారతదేశ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ, ద్వీప దేశం శ్రీలం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు భారత్ అందించిన సహాయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. మాల్దీవులలో ‘ఇండియా అవుట్’ ప్రచారం గురించి అడిగిన ప్రశ్నకు, జైశంకర్ జవాబిస్తూ.. భారతీయ దౌత్యాన్ని విశ్వసించమని అక్కడి వారిని కోరారు. “ప్రతి దేశానికి దాని పొరుగున సమస్యలు ఉంటాయి. అది వారు చెప్పినంత మంచిది కాదు. వారు చెప్పినంత చెడ్డది కాదు. సమస్యలు ఉంటాయి. మన పని ఏమిటంటే ఊహించడం, అంచనా వేయడం, ప్రతిస్పందించడం. చివరికి ఒక రోజు పొరుగువారు ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు.” అని విదేశాంగ మంత్రి అన్నారు. రాజకీయాల్లో పదునైన స్థానాలు తీసుకుంటారని, దౌత్యం ఎప్పుడూ ఆ పదునైన స్థానాల ద్వారా సాగదని ఆయన ఎత్తి చూపారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!