S Jaishankar: పొరుగు దేశాలపై చైనా ప్రభావం.. భారత్ భయపడాల్సిన అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
External Affairs Minister S Jaishankar: భారత్ పొరుగు దేశాలపై చైనా ప్రభావం చూపుతుందని, ఇలాంటి పోటీ రాజకీయాలకు భారత్ భయపడాల్సిన అవసరం లేదని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మంగళవారం అన్నారు. ప్రతి పరిసరాల్లో సమస్యలు ఉన్నాయని, కానీ చివరికి పొరుగువారికి ఒకరికొకరు అవసరమని.. ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో విద్యార్థులతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో మాల్దీవులతో ఉన్న సంబంధాల గురించి అడిగినప్పుడు ఆయన ఈ విషయం చెప్పారు. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావం గురించి పోటీ ఉంది, అయితే దీనిని భారత దౌత్య వైఫల్యంగా పేర్కొనడం తప్పు అని జైశంకర్ అన్నారు.
Read Also: MPs Suspension: బడ్జెట్కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
Also Read
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
“చైనా కూడా పొరుగు దేశమని, పోటీ రాజకీయాలలో భాగంగా ఈ దేశాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని మనం గుర్తించాలి. మనం చైనాను చూసి భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మనం ఓకే చెప్పాలని అనుకుంటున్నాను, ప్రపంచ రాజకీయాలు ఒక పోటీ ఉన్న ఆట. మీరు మీ వంతు కృషి చేయండి, నేను నా వంతు కృషి చేస్తాను” అని మంత్రి జై శంకర్ అన్నారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థ అయినందున, చైనా వనరులను మోహరిస్తుంది. దాని మార్గంలో విషయాలను మలచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాంటి సమయాల్లోనే పోటీకి మనం భయపడకూదని.. పోటీని స్వాగతించాలని, పోటీ చేయగలనని చెప్పాలని అన్నారాయన.
Read Also: Rahul Gandhi: నితీష్ కూటమి నుంచి అందుకే వైదొలిగారు.. మౌనం వీడిన రాహుల్
పొరుగు దేశాలకు సహాయం చేయడంలో భారతదేశ ట్రాక్ రికార్డ్ గురించి మాట్లాడుతూ, ద్వీప దేశం శ్రీలం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు భారత్ అందించిన సహాయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. మాల్దీవులలో ‘ఇండియా అవుట్’ ప్రచారం గురించి అడిగిన ప్రశ్నకు, జైశంకర్ జవాబిస్తూ.. భారతీయ దౌత్యాన్ని విశ్వసించమని అక్కడి వారిని కోరారు. “ప్రతి దేశానికి దాని పొరుగున సమస్యలు ఉంటాయి. అది వారు చెప్పినంత మంచిది కాదు. వారు చెప్పినంత చెడ్డది కాదు. సమస్యలు ఉంటాయి. మన పని ఏమిటంటే ఊహించడం, అంచనా వేయడం, ప్రతిస్పందించడం. చివరికి ఒక రోజు పొరుగువారు ఒకరితో ఒకరు సంబంధాలు కలిగి ఉంటారు.” అని విదేశాంగ మంత్రి అన్నారు. రాజకీయాల్లో పదునైన స్థానాలు తీసుకుంటారని, దౌత్యం ఎప్పుడూ ఆ పదునైన స్థానాల ద్వారా సాగదని ఆయన ఎత్తి చూపారు.
తాజావార్తలు
-
Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!