India vs Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యవెనక భారత్ ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో ఆరోపించడం వివాదాస్పదమైంది. అంతేకాకుండా అగ్రశ్రేణి భారత దౌత్యవేత్తను కెనడా బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడా సీనియర్ దౌత్యవేత్తను 5 రోజుల్లో భారత్ వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ ఖండించింది.
India: ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణల్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. కెనడా చేస్తున్న ఆరోపణలు అసబద్ధమైనవి, ప్రేరేమితమని భారత విదేశాంగ శాఖ ఘాటుగానే సమాధానం ఇచ్చింది. భారతదేశానికి చట్టబద్దమైన పాలనపై బలమైన నిబద్ధత ఉందని పేర్కొంది. ‘‘కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, వారి విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనను చూశామని, కెనడాలోని ఏదైన హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తిగా…
మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ మహిళ సయ్యదా లులు మిన్హాజ్ జైదీ చికాగో రోడ్లపై మానసిక ఒత్తిడితో పోరాడుతూ, తన వస్తువులు చోరీకి గురై ఆకలితో అలమటిస్తున్నారు.
Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు
మూడు రాష్ట్రాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జూలై 24న ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్లో అత్యధిక స్థానాలు ఆరు ఉండగా.. గుజరాత్లో మూడు స్థానాలు, గోవాలో ఒకటి ఉన్నాయి.
S Jaishankar: ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 21 నుంచి 24 వరకు అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఎంత ప్రతిష్టాత్మకమైందో వివరించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటనను ‘అత్యున్నత స్థాయి గౌరవం’గా ఆయన అభివర్ణించారు. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు.
Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. విదేశాలకు వెళ్లి సొంతదేశాలను విమర్శించడం ఏ పార్టీ అధినేతకు కూడా తగదని రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఉద్దేశించి అన్నారు. భారత్పై దుష్ప్రచారం చేయడానికే రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని ఆరోపించిన అమిత్ షా.. తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని సూచించారు.
S Jaishankar: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. విదేశాల్లో భారత్ ను విమర్శించడం రాహుల్ గాంధీకి అలవాటే అంటూ.. జాతీయ రాజకీయాలను విదేశాల్లో చర్చించడం శ్రేయస్కరం కాదని జైశంకర్ అన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యుల చేశారు. దీనిపై మీడియా జైశంకర్ ని ప్రశ్నించగా…
S Jaishankar: కొత్త పార్లమెంట్ భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్’ చిత్రంపై పాకిస్తాన్ ప్రేలాపనను తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. దీనిపై పాకిస్తాన్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. అవిభాజ్య భారతదేశం చిత్రాన్ని, అశోక సామ్రాజ్యాన్ని, బాధ్యతయుతమైన, ప్రజా ఆధారిత పాలనను ఇది చూపుతుందని, అర్థం చేసుకునే శక్తి పాకిస్తాన్ కు లేదని అందుకే దాన్ని అర్థం చేసుకోలేకపోతోందని విమర్శించారు.
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.