US- India: హౌతీ రెబల్స్ దాడులపై భారత్- అమెరికా మధ్య కీలక చర్చ..
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో ఎర్ర సముద్రంలో సవాలుగా మారతుతున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ వేదికగా (‘X’) ఇలా వ్రాశాడు.. నా స్నేహితుడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్తో నేను సంభాషణ చేసాను.. మా చర్చలు ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లపై దృష్టి సారించాం.. గాజాతో సహా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించామని పేర్కొన్నారు. కాగా, అలాగే, జైశంకర్ తో ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్తో కూడా ఫోన్లో మాట్లాడారు.
Read Also: Tiger Missing: కాగజ్ నగర్ లో టైగర్ మిస్సింగ్ మిస్టరీ.. నాలుగు పులులు ఏమయ్యాయి?
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అయితే, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జె. బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్తో మాట్లాడారు.. ఈ సంభాషణలో, మంత్రులిద్దరూ దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.. దీంతో పాటు భవిష్యత్తులో ఈ దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు అని పేర్కొన్నారు.
Read Also: Budget 2024 : నో డౌట్…మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే.. గందరగోళం లేదు
ఇక, ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు వాణిజ్య షిప్పింగ్ పై దాడులు చేయడంతో అమాయకమైన నావికులకు ప్రమాదంలో పడుతున్నారు. అలాగే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మిల్లర్ చెప్పారు. ఎర్ర సముద్రం అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసే ప్రధాన వాణిజ్య కారిడార్ అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నొక్కిచెప్పినట్లు ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంతంలో నావిగేషన్ స్వేచ్ఛను పరిరక్షించడానికి భారతదేశంతో సహకారాన్ని పెంచడాన్ని వారు స్వాగతించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం తీవ్రతరం కాకుండా నిరోధించే ప్రయత్నాలపై.. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించడంపై కూడా రెండు దేశాలకు చెందిన ఇద్దరు మంత్రులు చర్చించారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దూకుడు యుద్ధంపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో