US- India: హౌతీ రెబల్స్ దాడులపై భారత్- అమెరికా మధ్య కీలక చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో ఎర్ర సముద్రంలో సవాలుగా మారతుతున్న భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్-హమాస్ వివాదంతో పాటు ఉక్రెయిన్ లో తాజా పరిస్థితులపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక, జైశంకర్ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ట్విట్టర్ వేదికగా (‘X’) ఇలా వ్రాశాడు.. నా స్నేహితుడు యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్లింకెన్తో నేను సంభాషణ చేసాను.. మా చర్చలు ముఖ్యంగా ఎర్ర సముద్ర ప్రాంతంలో సముద్ర భద్రతా సవాళ్లపై దృష్టి సారించాం.. గాజాతో సహా పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించామని పేర్కొన్నారు. కాగా, అలాగే, జైశంకర్ తో ఆస్ట్రేలియా కౌంటర్ పెన్నీ వాంగ్తో కూడా ఫోన్లో మాట్లాడారు.
Read Also: Tiger Missing: కాగజ్ నగర్ లో టైగర్ మిస్సింగ్ మిస్టరీ.. నాలుగు పులులు ఏమయ్యాయి?
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
అయితే, అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ జె. బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్తో మాట్లాడారు.. ఈ సంభాషణలో, మంత్రులిద్దరూ దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు.. దీంతో పాటు భవిష్యత్తులో ఈ దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై ప్రధానంగా చర్చించారు అని పేర్కొన్నారు.
Read Also: Budget 2024 : నో డౌట్…మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీనే.. గందరగోళం లేదు
ఇక, ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల దాడులు వాణిజ్య షిప్పింగ్ పై దాడులు చేయడంతో అమాయకమైన నావికులకు ప్రమాదంలో పడుతున్నారు. అలాగే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించాయని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మిల్లర్ చెప్పారు. ఎర్ర సముద్రం అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసే ప్రధాన వాణిజ్య కారిడార్ అని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నొక్కిచెప్పినట్లు ప్రకటన పేర్కొంది. ఈ ప్రాంతంలో నావిగేషన్ స్వేచ్ఛను పరిరక్షించడానికి భారతదేశంతో సహకారాన్ని పెంచడాన్ని వారు స్వాగతించారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం తీవ్రతరం కాకుండా నిరోధించే ప్రయత్నాలపై.. గాజాలోని పౌరులకు మానవతా సహాయం అందించడంపై కూడా రెండు దేశాలకు చెందిన ఇద్దరు మంత్రులు చర్చించారు. ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న దూకుడు యుద్ధంపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!