Russian businessman died after falling from a hospital window: ఉక్రెయిన్పై రష్యా దాడిని వ్యతిరేకించిన రష్యన్ వ్యాపారవేత్త అనుమానాస్పద స్థితిలో మరణించారు. దేశంలో అతిపెద్ద చమురు కంపెనీ లుకోయిల్ చైర్మన్ రావిల్ మగనోవ్(67) ఆస్పత్రి కిటీకి నుంచి పడి గురువారం చనిపోయారు. ఇదే ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన మరణం మిస్టరీగా మారింది. దీనిపై రష్యా ఏజెన్సీలు విచారణ జరుపుతున్నాయి. మగనోవ్ సెంట్రల్ క్లినికల్ ఆస్పత్రి ఆరో అంతస్తు నుంచి పడి చనిపోయారు.
United Nations Security Council: రష్యా-ఉక్రెయిన్ యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో భారత్ తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మాణానికి భారత్ అనుకూలంగా ఓటేసింది. అయితే జెలెన్ స్కీ మాట్లాడేందుకు రష్యా వ్యతిరేకించింది. మొత్తం 15 సభ్య దేశాలు ఉన్న భద్రతా మండలిలో భారత్ తో పాటు మొత్తం 13 దేశాలు జెలెన్ స్కీకి మద్దతుగా నిలవగా..…
Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.
Six months into the Russia-Ukraine war: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి ఆరు నెలలు గడుస్తోంది. ఇప్పటికీ ఇరు దేశాలు ప్రతీ రోజు దాడులు చేసుకుంటున్నాయి. రష్యా దళాల నుంచి ఉక్రెయిన్ సేనలు ఎదురొడ్డి పోరాడుతున్నాయి. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్..
Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మాణాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను…
వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలోని జైలుపై ఉక్రెయిన్ అమెరికా తయారు చేసిన హిమార్స్ రాకెట్లతో దాడి చేసిందని, 40 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించారని, 75 మంది గాయపడ్డారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది.
Russia-ISS: కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లో కీలక భాగస్వాములుగా ఉన్నాయి రష్యా, అమెరికా. అయితే 2024 తరువాత తాము ఐఎస్ఎస్ నుంచి వైదొలుగుతున్నామని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చత్య దేశాలు విధిస్తున్న ఆంక్షలకు వ్యతిరేకంగా రష్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Russian President is seriously ill: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత శనివారం తెల్లవారుజామున పుతిన్ తీవ్రంగా వాంతులతో బాధపడినట్లు రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్వీఆర్ చెప్పింది. వెంటనే పుతిన్ అత్యవసర వైద్య బృందం హుటాహుటీన అధ్యక్ష కార్యాలయాని చేరుకుని చికిత్స అందించినట్లు వార్తలను వెల్లడించింది.