Singapore PM Lee Hsien Loong: ఇండియా అందుకనే రష్యా వ్యతిరేక తీర్మానాలకు దూరంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఫిబ్రవరిలో అమెరికా, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు ప్రతిగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆ సమయంలో భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉంది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం అయిన రష్యా ఫిబ్రవరిలో భద్రతామండలి అధ్యక్షుడిగా ఉండటంతో వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానం ఆమోదించకుండా అడ్డుకుంది. ఆ సమయంలో భారత్ , రష్యా, వియత్నాం, లావోస్ దేశాలు తీర్మాణానికి దూరంగా ఉన్నాయి.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Assam: అల్ ఖైదాతో సంబంధాలు.. ఇద్దరు ఇమామ్ల అరెస్ట్..
ఆసియాన్ లో అతి చిన్న దేశం సింగపూర్ ఆసక్తులు, ప్రాముఖ్యతలు సహజంగా ఇతరుకలు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. సింగపూర్, రష్యా దండయాత్రను ఖండించమే కాకుండా.. ఆంక్షలను విధించేందుకు ముందుకు వెళ్లిందని లీసింగ్ లూంగ్ అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని ఖండించడంలో సింగపూర్, అమెరికా వైపు కానీ రష్యా వైపు కానీ పక్షపాతం చూపడం లేదని అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని సింగపూర్ ఖండించకపోతే.. ఒక రోజు మనపై దాడి చేస్తే సింగపూర్ వైపు కూడా ఎవరూ నిలబడరని ఆయన అన్నారు.
మార్చిలో ఉక్రెయిన్ మానవతా సంక్షోభంపై రష్యా చేసిన ముసాయిదా తీర్మానంపై కూడా భారత్ గైర్హాజరైంది. ఆ సమయంలో రష్యా, చైనా తీర్మాణానికి మద్దతుగా ఓటేయగా.. భారత్ తో సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో భద్రతా మండలిలో రెండు పర్యాయాలు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి గైర్హాజరైంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!