National Medical Commission: ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Medical Commission: కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షకు అర్హత సాధించిన తర్వాత వారు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ ఓ పబ్లిక్ నోటీసులో తెలిపింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రెండేళ్ల సీఆర్ఎంఐ పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హులు. భారతీయ పరిస్థితులలో వైద్యం చేసే విధానాన్ని వారికి పరిచయం చేయడానికి ఈ రెండేళ్ల పాటు ఈ ఇంటర్న్షిప్ సాయపడుతుందని ఎన్ఎంసీ ప్రకటించింది.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో తమ క్లినికల్ శిక్షణను ఒకేసారి పూర్తి చేసేందుకు వీలుగా రెండు నెలల్లో ఒక పథకాన్ని రూపొందించాలని రెగ్యులేటరీ బాడీని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆదేశించింది. కరోనా మహమ్మారితో పాటు, ఉక్రెయిన్,-రష్యాల మధ్య జరిగిన యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేకమంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ తర్వాత వారికి భారత్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
తాజావార్తలు
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!