National Medical Commission: ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Medical Commission: కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షకు అర్హత సాధించిన తర్వాత వారు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ ఓ పబ్లిక్ నోటీసులో తెలిపింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రెండేళ్ల సీఆర్ఎంఐ పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హులు. భారతీయ పరిస్థితులలో వైద్యం చేసే విధానాన్ని వారికి పరిచయం చేయడానికి ఈ రెండేళ్ల పాటు ఈ ఇంటర్న్షిప్ సాయపడుతుందని ఎన్ఎంసీ ప్రకటించింది.
Also Read
- Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
- Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
- H-1B Visa: H-1B వీసాదారులకు ట్రంప్ సర్కారు షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా వీడాల్సిందే!
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో తమ క్లినికల్ శిక్షణను ఒకేసారి పూర్తి చేసేందుకు వీలుగా రెండు నెలల్లో ఒక పథకాన్ని రూపొందించాలని రెగ్యులేటరీ బాడీని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆదేశించింది. కరోనా మహమ్మారితో పాటు, ఉక్రెయిన్,-రష్యాల మధ్య జరిగిన యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేకమంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ తర్వాత వారికి భారత్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!