National Medical Commission: ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు శుభవార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Medical Commission: కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షకు అర్హత సాధించిన తర్వాత వారు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ ఓ పబ్లిక్ నోటీసులో తెలిపింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రెండేళ్ల సీఆర్ఎంఐ పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హులు. భారతీయ పరిస్థితులలో వైద్యం చేసే విధానాన్ని వారికి పరిచయం చేయడానికి ఈ రెండేళ్ల పాటు ఈ ఇంటర్న్షిప్ సాయపడుతుందని ఎన్ఎంసీ ప్రకటించింది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో తమ క్లినికల్ శిక్షణను ఒకేసారి పూర్తి చేసేందుకు వీలుగా రెండు నెలల్లో ఒక పథకాన్ని రూపొందించాలని రెగ్యులేటరీ బాడీని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆదేశించింది. కరోనా మహమ్మారితో పాటు, ఉక్రెయిన్,-రష్యాల మధ్య జరిగిన యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేకమంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ తర్వాత వారికి భారత్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..