National Medical Commission: ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థులకు శుభవార్త
National Medical Commission: కొవిడ్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్, చైనా నుంచి తిరిగివచ్చిన భారత వైద్య విద్యార్థులకు జాతీయ మెడికల్ కమిషన్ శుభవార్త తెలిపింది. జూన్ 30, 2022 లోపు లేదా అంతకు ముందు తమ ఇన్స్టిట్యూట్ల నుండి డిగ్రీలు పొందిన ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్(ఎఫ్ఎంజీ) పరీక్షకు అనుమతించబడతారని నేషనల్ మెడికల్ కమిషన్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ (ఎఫ్ఎంజీ) పరీక్షకు అర్హత సాధించిన తర్వాత వారు ప్రస్తుతం ఉన్న ఒక సంవత్సరానికి బదులుగా రెండు సంవత్సరాల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ (సీఆర్ఎంఐ) చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ ఓ పబ్లిక్ నోటీసులో తెలిపింది. విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు రెండేళ్ల సీఆర్ఎంఐ పూర్తి చేసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ పొందడానికి అర్హులు. భారతీయ పరిస్థితులలో వైద్యం చేసే విధానాన్ని వారికి పరిచయం చేయడానికి ఈ రెండేళ్ల పాటు ఈ ఇంటర్న్షిప్ సాయపడుతుందని ఎన్ఎంసీ ప్రకటించింది.
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, కొవిడ్ మహమ్మారి కారణంగా ప్రభావితమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ఇక్కడి వైద్య కళాశాలల్లో తమ క్లినికల్ శిక్షణను ఒకేసారి పూర్తి చేసేందుకు వీలుగా రెండు నెలల్లో ఒక పథకాన్ని రూపొందించాలని రెగ్యులేటరీ బాడీని సుప్రీంకోర్టు ఏప్రిల్ 29న ఆదేశించింది. కరోనా మహమ్మారితో పాటు, ఉక్రెయిన్,-రష్యాల మధ్య జరిగిన యుద్ధంతో విదేశీ వైద్య కళాశాలల్లో చేరిన అనేకమంది భారతీయ వైద్య విద్యార్థులు తిరిగి భారత్కు వచ్చేశారు. దీంతో వారందరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విదేశీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో చివరి సంవత్సరం చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులకు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్కు అనుమతి ఇస్తూ తాజాగా నేషనల్ మెడికల్ కమిషన్ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అనంతరం రెండేళ్ల పాటు కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్షిప్ తర్వాత వారికి భారత్లో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి అనుమతి లభిస్తుంది.
తాజావార్తలు
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!