Russia-Ukraine War: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా దాడి.. 22 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russian Strike On Ukraine Rail Station: ఉక్రెయిన్ – రష్యా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య ఈ ఏడాది ఫిబ్రవరి 24న యుద్ధం ప్రారంభం అయింది.. ఆరు నెలలు పూర్తి అయినా రెండు దేశాలు పట్టువీడటం లేదు. ముఖ్యంగా రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సర్వనాశనం అవుతోంది. ఇదిలా ఉంటే రష్యా జరిపిన మిస్సైల్ దాడిలో 22 మంది మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ బుధవారం వెల్లడించారు.
ఉక్రెయన్ లోని రష్యా ఆక్రమిత డోనెట్స్క్కు పశ్చిమాన 145 కి.మీ దూరంలో ఉన్న చాప్లిన్ అనే చిన్న పట్టణంలోని రైల్వే స్టేషన్ పై రాకెట్ దాడులు చేసింది..నాలుగు రైల్వే క్యారేజీలు అగ్నికి ఆహుతి కాగా.. 22 మంది మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాలను యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో వీడియో ప్రసంగంలో జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యాకు ఎప్పటికీ లొంగబోమని.. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు అన్ని ఉక్రెయిన్ భూభాగాలను స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే రష్యా దాడుల్లో రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం అయిన ఖార్కీవ్ కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఖార్కీవ్ లో విధ్వంసం తారాస్థాయిలో ఉంది. దీంతో పాటు మరియోపోల్, సుమీ, ఎల్వీవ్ నగరాలపై కూడా రష్యా మిస్సైళ్లతో దాడులు చేసింది.
Also Read
- Trump: నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు.. ఇజ్రాయెల్లో నేనే ప్రధాని కావొచ్చన్న ట్రంప్
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Modi-Meloni: గంటల్లోనే కోట్లలో వ్యూస్.. ఇంటర్నెట్లో ప్రకంపనలు రేపుతున్న మెలోడీ వీడియో
Read Also: Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో నేడు సుప్రీంకోర్టు కీలక విచారణ..
1991లో సోవియట్ యూనియన్ పతనం అనంతరం ఉక్రెయిన్ ఏర్పడింది. ఆగస్టు నెలలో ఉక్రెయిన్ స్వాతంత్య్ర వేడుకలను చేసుకుంటోంది. ఉక్రెయిన్ నాటో సైనిక కూటమిలో చేరే ప్రయత్నంతో రష్యా, ఉక్రెయిన్ పై దాడిని ప్రారంభించింది. ఇప్పటి వరకు యూఎస్ఏ ఉక్రెయిన్ కు 13.5 బిలియన్ డాలర్ల సైనిక, ఆయుధ సహాయాన్ని అందించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ 2 వేల డ్రోన్లను, 63.5 మిలియన్ డాలర్ల సహాయాన్ని చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం తూర్పు ఉక్రెయిన్ లోని డోన్ బాస్ ప్రాంతంలోని లూహాన్స్క్, డొనేత్సక్ ప్రావిన్సుల్లోని చాలా ప్రాంతాలు రష్యా ఆధీనంలో ఉన్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం నుంచే రష్యా దాడులను చేస్తోంది.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!