UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
- మరోసారి రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు శ్రీకారం
- నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ
- చర్చలపై సర్వత్రా ఉత్కంఠ
రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రష్యా-అమెరికా-ఉక్రెయిన్ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదిక కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు యూఏఈలో ఈ సమావేశం జరగబోతుందని దావోస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఇలా త్రైపాక్షిక సమావేశం ఇదే తొలిసారి కావడం విశేషం.
జెలెన్స్కీ..
ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య మొదటి త్రైపాక్షిక సమావేశం జరుగుతోందని.. ఇది యుద్ధం ముగింపునకు దారితీస్తుందని జెలెన్స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్లో ట్రంప్తో జెలెన్స్కీ గంట సేపు సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత ట్రంప్తో మంచి చర్చలు జరిపినట్లుగా వెల్లడించారు. గురువారం ఉక్రెయిన్ బృందం ట్రంప్తో సమావేశమైందని.. అమెరికా బృందం రష్యాకు వెళ్తోందని జెలెన్స్కీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా నష్టపోయిందని.. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి.. శాంతి పరిష్కారానికి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని జెలెన్స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చలపై గంట సేపు ట్రంప్తో చర్చించినట్లు పేర్కొన్నారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
ట్రంప్..
ఇక జెలెన్స్కీతో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని.. యుద్ధం ముగియాలని ఆకాంక్షించారు. అమెరికా బృందం పుతిన్ను కలవబోతుందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు.. ఇక యుద్ధం ముగించాలని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తక్షణమే కాల్పుల విరమణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇద్దరు నాయకులు కూడా కాల్పుల విరమణకు ముందుకు రావాలని పుతిన్, జెలెన్స్కీకి ట్రంప్ పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: Jharkhand Video: జార్ఖండ్లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ చర్చలు ఫలించలేదు. అనంతరం నేరుగా ట్రంప్ రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్హౌస్లో జెలెన్స్కీతో సమావేశం అయ్యారు. అయినా కూడా ఫలించలేదు. అటు తర్వాత 28 పాయింట్లు ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చారు. దీనికి పుతిన్ అంగీకారం తెలపగా.. జెలెన్స్కీ వ్యతిరేకించారు. ఇది కూడా దారి చూపించలేదు. ఇప్పుడు యూఏఈ వేదిక సమావేశం జరుగుతోంది. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.
ఇది కూడా చదవండి: Rahul Sankrityan: ‘ప్రామిస్.. మీ ఆకలి తీరుస్తా’! విజయ్ ఫ్యాన్కు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్రేజీ రిప్లై..
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!