అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత్ దుమ్మురేపింది. 177 పరుగుల విజయలక్ష్యాన్ని 28 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది. టీమిండియాకు వన్డేల్లో ఇది 1000వ వన్డే కావడంతో ఈ మ్యాచ్ను మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది. Read Also: మాజీ క్రికెటర్ సురేష్ రైనా నివాసంలో విషాదం ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్…
ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్కు శిఖర్ ధావన్ దూరం కావడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్కు ఎవరు వస్తారో అన్న అంశంపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాకు వెల్లడించాడు. ఇషాన్ కిషన్ ఒక్కడే ప్రస్తుతం ఆప్షన్గా ఉన్నాడని, తనతో పాటు అతడు ఓపెనింగ్ చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు. Read Also: కుంబ్లే-కోహ్లీ మధ్య…
దక్షిణాఫ్రికా గడ్డపై వరుస పరాజయాలతో డీలా పడ్డ టీమిండియా.. త్వరలో సొంతగడ్డపై వెస్టిండీస్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో విజయం సాధించి మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్.. ప్రస్తుతం పూర్తి కోలుకుని ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. రోహిత్ బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో ఫిట్నెస్ పరీక్షకు హాజరుకానున్నాడు. ఆ తర్వాతే సెలక్షన్…
టీమిండియాలో గత కొంతకాలంగా జరుగుతోన్న పరిణామాలపై అనేక రకాల ప్రచారం జరిగింది.. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత.. బీసీసీఐ, టీమిండియాలోని కొందరు ఆటగాళ్లతో విరాట్ కోహ్లీకి విబేధాలు ఉన్నాయంటూ పుకార్లు షికార్లు చేశాయి.. అయితే, ఈ పుకార్లపై తాజాగా స్పందించారు భారత జట్టు చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ… విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు నెలకొన్నాయన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన.. ఆ ప్రచారంలో వాస్తవం లేదన్నారు.. అవన్నీ పనిలేని వ్యక్తులు…
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు. Read…
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో…
భారత అండర్-19 జట్టుకు రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీలో క్లాస్ తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం భారత జట్టు మొత్తం మూడు టెస్టుల సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లిన విషయం తెలిసిందే. కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ముంబైలో జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ గాయం బారిన పడ్డారు. దాంతో ఈ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా ఎంపికైన రోహిత్ పూర్తి సిరీస్ కు దూరం అయ్యాడు. ఇక ప్రస్తుతం నేషనల్…
ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలి.. బీసీసీఐ టీమ్ మేనేజ్ మెంట్, టూర్లు, బిజినెస్ సంగతి చూడాలి. ఇక్కడ ఆ డివిజన్లో క్లారిటీ మిస్సయింది. ఇగోలు, పవర్ గేమ్ లు మొదలయ్యాయి. ఆటగాళ్లను కంట్రోల్ చేయాల్సిన బీసీసీఐ కంట్రోల్ తప్పుతోందా? లేని వివాదాలు సృష్టిస్తూ ప్లేయర్ల మధ్య గ్యాప్ పెంచుతోందా? భారత్ క్రికెట్ జట్టులో జరుగుతున్న పరిణామాలు… దేశ పరువును పొగొట్టేలా ఉన్నాయి. ప్లేయర్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సరిదిద్దాల్సిన కెప్టెన్లే… ఇప్పుడు గొడవపడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్లు రోహిత్…
ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారు. రోహిత్-విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత ముదిరిపోయాయ్. వన్డే సిరీస్కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యానంటున్నాడు కోహ్లీ. అనారోగ్యంతో టెస్టులకు దూరమయ్యాడు రోహిత్. ఐతే…కెప్టెన్సీ కోల్పోవటంతో కోహ్లీ మనస్తాపం చెందాడు. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో వివాదాలు ముదిరిపోయాయ్. మరోవైపు…కోహ్లీని దారిలో పెట్టే పనిలో పడింది బీసీసీఐ. కోహ్లీ వ్యవహార శైలి ధిక్కారమే అంటున్నాయ్ బీసీసీఐ వర్గాలు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ…
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది.…