RP Singh: రోహిత్ శర్మకు విశ్రాంతి అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 9వ తేదీ నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనున్న విషయం తెలిసిందే! అయితే.. రోహిత్ శర్మ సహా విరాట్ కోహ్లీ, బుమ్రాలను విశ్రాంతి పేరిట ఈ సిరీస్కు ఎంపిక చేయలేదు. కొంతకాలం నుంచి తీరిక లేకుండా ఆడుతున్న ఈ సీనియర్లకు విశ్రాంతి తప్పదని చెప్పి, సెలెక్టర్లు తుది జట్టులోకి వారిని తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ పేసర్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. రోహిత్ శర్మకు విశ్రాంతీ తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పాడు.
‘‘రోహిత్ శర్మ ఈ సిరీస్ ఆడాలని నేను కోరుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవాలా? వద్దా? అనేది అతని వ్యక్తిగతం. నిజానికి.. విశ్రాంతి అనేది ఓ ఆటగాడు ఎంత అలసటను అనుభవిస్తున్నాడనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అయితే, ఇక్కడ రోహిత్కు విరామం అవసరం లేదు. ఇది సుదీర్ఘమైన సిరీస్ కాబట్టి అతడు కచ్ఛితంగా ఆడాల్సిందే. పైగా రోహిత్ శర్మ కెప్టెన్ కూడా.. ఈ విషయాన్ని మర్చిపోకండి. అవును, గత టీ20 లీగ్లో అతడు 400కి పైగా పరుగులు చేయలేదు. నిలకడగా రాణించనూ లేదు. కానీ రెండు, మూడు సార్లు మంచి ఇన్నింగ్స్ ఆడాడు. కావున అతడు దూకుడుగా బ్యాటింగ్ చేయగలడని భావిస్తున్నా. టీ20 ఫార్మాట్లో మ్యాచ్ విన్నర్లు కావాలి’’ అంటూ ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Ayush Shetty: ప్రపంచ ఛాంపియన్షిప్లో సంచలనం.. ప్రపంచ నెం.1 'షి యూకీ'ని మట్టికరిపించిన ఆయుష్ శెట్టి..!
- Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
- Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
- Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన 'స్టార్ ఆల్రౌండర్'..
కాగా.. ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు. మొత్తం 14 మ్యాచుల్లో అతడు 268 పరుగులే చేశాడు. దీనికితోడు అతడు ఈ సీజన్లో ఒక్క అర్థసెంచరీ కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలోనే అతనికి విశ్రాంతి అవసరమని భావించి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్కు ఎంపిక చేయలేదు. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే అభిప్రాయంతో ఎంపిక చేయలేదు. మరోవైపు.. బారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్ జూన్ 9వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనుంది.
తాజావార్తలు
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం?
-
Anasuya Bharadwaj: మరో వివాదంలో నటి అనసూయ.. ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కేసు నమోదు ..
-
NC25 : వెంకీ అట్లూరి దర్శకత్వంలో అక్కినేని హీరో మైల్స్టోన్ మూవీ?
-
AP Assembly: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్తో ప్రారంభం కానున్న శాసనసభ!
ట్రెండింగ్
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!