కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గతంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా హాట్ కామెంట్లు చేసిన కాక రేపిన ఆయన.. ఆ తర్వాత కాస్త సైలెంట్గానే ఉన్నారు.. అయితే, పీసీసీ చీఫ్ పదవి రేవంత్ రెడ్డికి ఇచ్చిన తర్వాత ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సంచలన కామెంట్లు చేసి.. ఆ తర్వాత ఇక పొలిటికల్ కామెంట్లు చేయనని ప్రకటించారు.. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో, పలు గ్రామాలలో శంకుస్థాపన, అభివృద్ధి పనులు…
నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ మొదటి జిల్లా పర్యటన ఇది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యా వసర ధరల పెరుగుదలకు నిరసనలు చేస్తున్నారు. ఆదిలాబాద్ లో కు కొండా సురేఖ, మంచిర్యాల కు సిరిసిల్ల రాజయ్య, కొమురం భీం జిల్లా లో అన్వేష్ రెడ్డి పర్యటనలు…
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. 2022 ఆగస్టు 15 తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దుచేస్తారన్నారు రేవంత్ రెడ్డి. కేటీఆర్లా తనకు గాలివాటంలా ఉద్యోగం రాలేదని మీడియాతో చిట్చాట్లో అన్నారు. పొత్తులో కేటీఆర్ కి టికెట్ ఇచ్చినప్పుడు ఎంతకి కొన్నారని ప్రశ్నించారు. కేటీఆర్కు రాజకీయ భిక్ష పెట్టిందే టీడీపీ అన్నారు. అలాగే ఎమ్మెల్యే కాకుండానే కాంగ్రెస్ ప్రభుత్వంలో హరీష్రావు మంత్రి అయ్యారన్నారాయన. హరీష్రావు బతుకే కాంగ్రెస్ అని.. టీడీపీని విమర్శిస్తూనే…
తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్ జయంతి…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
టి.పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.. కేటీఆర్ మరోసారి ఇలా రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. జాగ్రత్త అని హెచ్చరించారు.. కేటీఆర్ ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు అంటే .. దానికి కారణం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టేనని గుర్తుచేసిన ఆయన.. చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయిన సంపత్.. కాంగ్రెస్ చిన్న…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక దూకుడును పెంచారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నా, ఆ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. Read: పాత్రల్లో పరకాయప్రవేశం…
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్… తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ… సోనియాను ఇప్పుడు తెలంగాణ తల్లి అంటున్నాడు.. ఆయనే గతంలో సోనియాను బలి దేవత అన్నారని వ్యాఖ్యానించారు.. రేపు చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా అంటాడు అంటూ ఎద్దేవా చేసిన ఆయన.. టీడీపీ పాత వాసనలు ఇంకా పోలేదని.. టీపీసీసీ కాదు తెలుగు దేశం కాంగ్రెస్ అని కాంగ్రెస్ నేతలే అంటున్నారని కామెంట్ చేశారు.. నోట్ల…
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు…