రేవంత్ పై ఫిర్యాదును పట్టించుకోని రాహుల్.. ఆ నేతలకు షాకిచ్చినట్టేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. వీరికి బయటి శత్రువుల కంటే లోపటి శత్రువులే ఎక్కువ అని ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతుంటారు. మహాసముద్రం లాంటి కాంగ్రెస్ ను ఈదలాంటే చిన్నచిన్న చేపలు బలి కావాల్సిందనేలా ఆపార్టీ నేతల తీరు ఉంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీలో పీసీసీ పదవి అంటే నేతలంతా సీఎం పదవితో సమానంగా చూస్తుంటారు. దీని కోసం నేతల మధ్య కుస్తీలు మామూలుగా ఉండవు. ఈ విషయం మొన్నటి టీపీసీసీ చీఫ్ నియామకంతో అందరికీ తెలిసి వచ్చి ఉంటుంది. ఈ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్ లో చిన్నస్థాయి నేత నుంచి అగ్రస్థాయి నేత వరకు ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి లక్ కలిసి రావడంతో అధిష్టానం ఆయనవైపు మొగ్గుచూపింది. దీంతో ఎన్నాళ్ల నుంచో కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న కొత్త టీపీసీసీ అంకానికి తెరపడినట్లయ్యింది.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అయ్యాక కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ నెలకొంది. టీఆర్ఎస్ కు ధీటైన నాయకుడు దొరకాడంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ లోని కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగానే రేవంత్ పై విమర్శలు చేస్తున్నారు. టీపీసీసీ నిర్ణయాలను ధిక్కరిస్తూ రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నారు. రేవంత్ రెడ్డికి కొత్త టీపీసీసీ కార్యవర్గం పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కొందరు రేవంత్ వెంటే ఉంటూ అధిష్టానానికి ఆయనపై వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
రాహుల్ గాంధీతో ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. కొత్త టీపీసీసీ కార్యవర్గం నియామకం అయ్యాక రేవంత్ రెడ్డి సహా ముఖ్యనేతలతో రాహుల్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కూడా నేతలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లు సమాచారం. కొందరు నేతలు రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించినట్లు తెలుస్తోంది. అయితే మరికొందరేమో రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేసేందుకు యత్నించారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలను అందరితో చర్చించి తీసుకుంటారు.. కానీ కొత్త నాయకత్వం ఆ పని చేయడం లేదని నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశం కంటే ముందుగానే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిపై ఆరా తీసుకున్నట్లు టాక్. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామాకం అయ్యాక కాంగ్రెస్ లో కొత్త జోష్ వచ్చిందని ఆయనకు నివేదికలు అందించినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ నేతలు రేవంత్ పై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.
తెలంగాణ పార్టీ రేవంత్ రెడ్డితో మళ్లీ పుంజుకుంటుందని.. ఈ సమయంలో నేతలంతా కలిసి కట్టుగా పని చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు సమాచారం. రాహుల్ గాంధీ తనపై నమ్మకం పెట్టుకోవడంతో రేవంత్ రెడ్డి ఈ భేటి తర్వాత ఫుల్ జోష్ లో కన్పిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇవన్నీ చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్ రేవంత్ శకం మొదలైనట్లే కన్పిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!