TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మెట్రో స్వాధీనం.. వైద్య రంగంలో భారీ మార్పులు!
- తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు
- ప్రతి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు భూ కేటాయింపు
- తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరు మార్పు
- ఇకపై ప్రభుత్వ పరిధిలోకి టీవీవీపీ ఉద్యోగులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Cabinet Decisions : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర పురోగతికి సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు వ్యవహారం, వైద్య విధాన పరిషత్లో మార్పులు , భూ కేటాయింపులపై కేబినెట్ ముద్ర వేసింది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న అత్యంత కీలక నిర్ణయం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) సంస్థ నిర్వహణలో ఉన్న మెట్రోను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ప్రజారవాణాను మరింత బలోపేతం చేసే దిశగా, ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి మెట్రోను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
India: ఇరాన్లోని భారతీయులకు హై అలర్ట్.. వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఆదేశం!
Also Read
- Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- IPS Transfers: తెలంగాణలో 26 మంది IPSల బదిలీ.. ఎవరికి ఏ పోస్టింగ్.?
రాష్ట్రంలోని వైద్య రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘తెలంగాణ వైద్య విధాన పరిషత్’ (TVVP) పేరును ఇకపై **’డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’**గా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మార్పుతో పాటు, ఇప్పటివరకు పరిషత్ పరిధిలో ఉన్న ఉద్యోగులను పూర్తిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయించారు. దీనివల్ల వేలమంది వైద్య సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. రాజకీయ పార్టీల బలోపేతానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మరికొన్ని కీలక భూ కేటాయింపులపై కూడా కేబినెట్ స్పష్టతనిచ్చింది. ఖమ్మం జిల్లాలో టీటీడీ ఆలయ నిర్మాణం లేదా ఇతర ఆధ్యాత్మిక సేవల కోసం 20 ఎకరాల భూమిని కేటాయించారు. మహబూబాబాద్ జిల్లా గుమ్మడూరులో కొత్తగా జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణానికి గాను 70 ఎకరాల భారీ కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం , రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు తక్షణమే అమలులోకి రానున్నాయి.
AP Social Media Cases: సోషల్ మీడియా పోస్టులపై 20 నెలల్లో 1,384 కేసులు.. 1,067 మంది అరెస్ట్..
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!