మునుగోడు ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు ఎవడు ..!? అంటూ ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్లో మనస్పర్థలు ఉన్నాయి.. కానీ.. మర్రి శశిధర్ రెడ్డి కూల్ పర్సన్ అని చెప్పుకొచ్చారు. నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళను బీజేపీ పక్కన పెట్టిందని, అలాంటివి అన్ని పార్టీల్లో సహజమే అన్నారు. సీనియర్ లను అవమానించే అంతటి శక్తి మాన్ ఎవరు లేరని పేర్కొన్నారు. కొన్ని అభిప్రాయాలు…
Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని…
నన్ను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా.. ఇక్కడే చస్తా అని ప్రకటించారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. ఇవాళ ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఉపఎన్నిక కసరత్తు మీటింగ్కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదన్నారు.. ఏ మీటింగ్ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. నాకు ఆహ్వానం లేని మీటింగ్కు నేను ఎందుకు వెళ్తా? అని ప్రశ్నించారు. ఇక, చండూరులో సభలో నన్ను అసభ్యంగా తిట్టించారు. హోంగార్డుతో పోల్చారు.…