Khammam : భూదాన్ భూముల వివాదంపై సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..
- వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి పరిష్కారం
- బాధితులకు ఇళ్ల పట్టాల పంపిణీకి సర్కార్ నిర్ణయం
- 310 కుటుంబాలకు టోకెన్లు.. ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం
- ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదలకు కొత్త ఆశలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల రోడ్డున పడ్డ పేదలకు అండగా నిలుస్తూ, రేపు (బుధవారం) ఖమ్మం కలెక్టరేట్ వేదికగా బాధితులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుంది.
LPG Crisis: LPG కొరత వేళ, సిలిండర్ల లారీ దొంగతనం..
Also Read
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు
- OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
- OTR : సుస్మిత వ్యాఖ్యలతో కొండా సురేఖకు చిక్కులు? పదవిపై కత్తి వేలాడుతుందా?
గత నెల 24న వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాల పేరుతో అధికారులు చేపట్టిన కూల్చివేతలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సుమారు 15 ఏళ్ల క్రితమే తాము పట్టాలు పొందామని, తమ ఇళ్లను ఎలా కూల్చుతారని బాధితులు చేసిన పోరాటంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీనిపై లోతైన సర్వే నిర్వహించిన జిల్లా అధికారులు, ప్రాథమికంగా 310 మందిని అర్హులుగా గుర్తించి వారికి టోకెన్లు కూడా జారీ చేశారు. ప్రభుత్వం కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, బాధితులు తమ కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనుంది.
Jana Sena Party Membership: జనసేన సభ్యత్వ నమోదుపై పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం..
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పేదలకు అన్యాయం జరగనివ్వబోమని, ఇది ఇందిరమ్మ ప్రభుత్వమని స్పష్టం చేశారు. భూమి లేని నిరుపేదలకు ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. వెలుగుమట్లలోని వివాదాస్పద భూమిని భవిష్యత్ అవసరాల కోసం లేదా ప్రజా ప్రయోజనార్థం ఉపయోగించాలని యోచిస్తున్న ప్రభుత్వం, బాధితులకు మాత్రం ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయంగా మెరుగైన స్థలాలను కేటాయించేలా చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో గత కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్న వందలాది కుటుంబాల్లో మళ్లీ వెలుగులు నిండనున్నాయి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?