Revanth Reddy : భవిష్యత్తులో ఈ నాయకులకు పార్టీ సరైన స్థానం కల్పిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డి గెలుపునకు కృషి చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఏ రేవంత్ రెడ్డి ఆదివారం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు పల్లె రవి, కైలాష్ నేత, కృష్ణా రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు కానీ వేరు వేరు పరిస్థితుల కారణంగా హైకమాండ్ స్రవంతి రెడ్డికి టికెట్ కేటాయించింది. టికెట్ రాని నాయకుల్లో నిరాశ తప్పదని, అయితే హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఈ నాయకులకు పార్టీ సరైన స్థానం కల్పిస్తుందని, వారి సేవలకు కూడా గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.
Also Read
ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనవసరంగా మతపరమైన అంశాలను లేవనెత్తుతుందని, ఈ క్రమంలో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉపఎన్నిక సందర్భంగా పార్టీ అభ్యర్థి గెలుపునకు తమవంతు సహకారాన్ని అందజేసేందుకు నేతలంతా అంగీకారం తెలిపారన్నారు. ప్రచారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను క్యాడర్ బయటపెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!