RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశం కానుంది. ఆర్థిక సంవత్సరంలో రెండవ MPC సమావేశం జూన్ 6 నుండి 8 వరకు కొనసాగుతుంది. ఈ సమావేశ ఫలితాలు జూన్ 8 న ప్రకటిస్తారు.
Today Business Headlines 28-04-23: స్విగ్గీలో 10 వేల జాబులు: ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఈ సంవత్సరం పది వేల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ మేరకు అప్నా అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నియమించుకునే ఉద్యోగులను తన ఇన్స్టామార్ట్ సర్వీసుల కోసం వాడుకోనుంది. ముఖ్యంగా టయర్ వన్, టయర్ టు సిటీల్లో ఈ రిక్రూట్మెంట్ చేపట్టనుంది.
Business Headlines 01-03-23: బీడీఎల్ డివిడెండ్ రూ.112 కోట్లు: భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 112 కోట్ల రూపాయలను డివిడెండ్ కింద చెల్లించింది. ఈ మేరకు BDL చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిశ్రా నిన్న మంగళవారం ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్కి చెక్ అందజేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ.. ఒక్కో షేర్కి 8 రూపాయల 15 పైసల చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్లో విలీనం?: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్టెల్ అధినేత సునీల్ మిత్తల్ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
RBI Governor on CryptoCurrencies: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంతదాస్ ఇటీవల ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసలు వాటి వల్ల దేశానికి, ప్రజలకు ఏంటి ఉపయోగం అని నిలదీశారు. పైసా కూడా ప్రయోజనంలేని ఇలాంటివాటిని ఇంకా ప్రోత్సహిస్తే మరో ఘోర ఆర్థిక మాంద్యానికి దారితీయక తప్పదని హెచ్చరించారు. తన మాటలను రాసిపెట్టుకోవాలని, క్రిప్టో కరెన్సీలకు ముకుతాడు వేయకపోతే తాను చెప్పింది జరిగి తీరుతుందని బల్ల గుద్ది చెప్పారు.
RBI interest Rates Hike: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందరి అంచనాలనూ మించి రెపో రేటుని పెంచింది. దేశంలోని వివిధ వాణిజ్య బాంకులకు తాను ఇచ్చే లోన్లపై వసూలు చేసే వడ్డీ (రెపో) రేటును 50 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) హైక్ చేసింది. దీంతో ఇది 5.40 శాతానికి చేరింది.
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చు అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదేమోనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సరుకు రవాణా వ్యవస్థలో అవాంతరాల వల్ల నిత్యవసరాల ధరలు నింగినంటాయి. అయితే ఉక్రెయిన్పై నాలుగు నెలలుగా…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్నే కొనసాగించాలని నిర్ణయానికి వచ్చింది.. ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించింది ప్రభుత్వం.. శక్తికాంత దాస్ పునర్నియామకాన్ని కేబినెట్ పునర్నియామక కమిటీ ఆమోదించింది. కాగా, ఆర్బీఐ గవర్నర్గా ఉన్న శక్తికాంత్ దాస్ పదవి కాలం ఈ ఏడాది డిసెంబర్ 10 తేదీతో ముగిసిపోనుంది.. కానీ, ఆయనను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం.. ఈ నిర్ణయం…