11-07-22 Business Headlines: ఈరోజు బిజినెస్ వార్తల ముఖ్యాంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గొచ్చు
అక్టోబర్ నుంచి ద్రవ్యోల్బణం తగ్గే అవకాశాలున్నాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ధరల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదేమోనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. సరుకు రవాణా వ్యవస్థలో అవాంతరాల వల్ల నిత్యవసరాల ధరలు నింగినంటాయి. అయితే ఉక్రెయిన్పై నాలుగు నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా ఈమధ్య కొంచెం శాంతించటంతో ఉద్రిక్త వాతావరణం చల్లబడింది. దీంతో ఆర్బీఐ నుంచి సానుకూల అంచనాలు వెలువడుతున్నాయి.
Also Read
- SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
- ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
- Dog Nanny Jobs: ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.. కుక్కను చూసుకుంటే చాలు.. లక్షల్లో జీతం..!
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
ఎలాన్ మస్క్పై లీగల్ యాక్షన్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్పై లీగల్ యాక్షన్కి ట్విట్టర్ రెడీ అవుతోంది. ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఆయన అర్ధంతరంగా రద్దు చేసుకోవటం వల్లే ఈ చర్యకు దిగుతోంది. 44 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్ని ఎలాన్ మస్క్ క్యాన్సిల్ చేసుకోవటంతో ట్విట్టర్ తీవ్రంగా నష్టపోనుందని నిపుణులు అంటున్నారు.
ఇండిగో టెక్నీషియన్ల మూకుమ్మడి సెలవు
వేతనాలను నామమాత్రంగా పెంచటంపై ఇండిగో టెక్నీషియన్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మూకుమ్మడిగా సిక్ లీవ్ పెట్టి ఎయిరిండియా ఇంటర్వ్యూకి వెళ్లారు. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసులకు అంతరాయం కలగటంతో ఈ విషయం బయటికొచ్చింది. ముఖ్యంగా ఢిల్లీ, హైదరాబాద్ వంటి మేజర్ హబ్లలో సిబ్బంది కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. సిబ్బందితోపాటు పైలట్ల వేతనాన్ని తాజాగా 8 శాతం పెంచింది.
2 నెలల్లో సిడ్బి ఆన్లైన్ ప్లాట్ ఫాం
స్టార్టప్లను, ఇన్వెస్టర్లను ఒకే చోటకి తెచ్చేందుకు సిడ్బి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేస్తోంది. ఇది రెండు నెలల్లో రెడీ అవుతుందని సంస్థ ప్రతినిధి శృతి సింగ్ చెప్పారు. పోర్టల్ అందుబాటులోకి వస్తే స్టార్టప్లకు ఉపయోగం కలుగుతుందని అన్నారు. నిధుల కోసం ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూడాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు.
విమాన ఇంధనంపై ట్యాక్స్ తొలగింపు
విదేశాలకు సర్వీసులను నడిపే విమానయాన సంస్థలకు ఇంధనంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మన దేశ సంస్థలు కూడా అంతర్జాతీయ కంపెనీల సరసన చేరతాయి. అయితే.. దేశీయంగా రాకపోకలు సాగించే సంస్థలకు మాత్రం ఏటీఎఫ్పై 11 శాతం ఎక్సైజ్ పన్ను కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.
3 నెలల్లో దిగొచ్చిన ఉక్కు ధరలు
ఉక్కు ధరలు మూడు నెలల్లో 24 శాతం దిగొచ్చాయి. ఏప్రిల్ 6వ తేదీన 78 వేల రూపాయలుగా ఉన్న టన్ను స్టీల్ రేటు ఈ నెల 6వ తేదీన 59 వేల 8 వందలకు పడిపోయింది. ఈ ధరలు ఇంతకన్నా పడిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
-
Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
-
Aadarsha Kutumbam AK47:వెంకీ – త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్లో..మరో బ్యూటీ ఎంట్రీ..!
-
Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో “కాక్రోచ్” పేరుతో కొత్త పార్టీలు..
-
DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!