Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Business Headlines 25 02 23 Sunil Mittal To Merge Airtel Payments Bank With Paytm Payments Bank

Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ విలీనం?. మరిన్ని వార్తలు

Published Date :February 25, 2023 , 11:39 am
By Akkirala Kondala Rao
Business Headlines 25-02-23: పేటీఎం బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ విలీనం?. మరిన్ని వార్తలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Business Headlines 25-02-23:

పేటీఎం బ్యాంక్‌లో విలీనం?

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ విలీనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిత్తల్‌ ప్రణాళిక రూపొందించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పేటీఎంలో విలీనం కావటం ద్వారా వాటా సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. ఇతర షేర్‌ హోల్డర్ల నుంచి కూడా పేటీఎంలోని వాటాలను కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెబుతున్నారు. అయితే.. ఈ వార్తలపై స్పందించేందుకు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రతినిధి నిరాకరించారు. ఇవన్నీ మార్కెట్‌ ఊహాగానాలేనని తెలిపారు.

జీ ఎంటర్టైన్‌మెంట్‌కి ఊరట

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌కి నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌.. NCLATలో ఊరట లభించింది. ఆ సంస్థపై గత వారం మొదలైన దివాలా చర్యలను NCLAT నిలిపివేసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ పునీత్‌ గోయెల్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించింది. అనంతరం.. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు మరియు ఇంటెరిమ్‌ రిజల్యూషన్‌ ప్రొఫెషనల్‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని గడువు విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 29వ తేదీకి వాయిదా వేసింది.

ఇంకా అనిశ్చిత పరిస్థితులే

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. ఈ సవాళ్లను జీ20 దేశాలు సంకల్పంతో పరిష్కరించాలని సూచించారు. జీ20 దేశాల ఆర్థిక మంత్రులు మరియు కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశంలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. మాంద్యానికి బదులు మందగమనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఇదే సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాల రుణాలు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

టాటా.. 3 డార్క్‌ ఎడిషన్లు

టాటా మోటార్స్‌ సంస్థ.. స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికిల్స్‌ కేటగిరీలో మూడు డార్క్‌ ఎడిషన్లను ఆవిష్కరించింది. నెక్సాన్‌, హారియర్‌, సఫారీల్లో ఈ ఎడిషన్లను రూపొందించింది. ఈ అప్డేటెడ్‌ వాహనాల్లో అమర్చిన అధునాతన సదుపాయాల వల్ల ప్రయాణికులకు మరింత భద్రత లభిస్తుందని టాటా మోటార్స్‌ తెలిపింది. కాలుష్య ఉద్గారాలకు సంబంధించిన తాజా ప్రమాణాలకు లోబడి వీటికి డిజైన్‌ చేసినట్లు వివరించింది. ఈ వాహనాల ధరలు 12 లక్షల 35 వేల నుంచి ప్రారంభమవుతాయని, గరిష్ట ధర 22 లక్షల 71 వేల రూపాయలని స్పష్టం చేసింది.

యూకో బ్యాంక్‌ లక్ష్యమిదే

యూకో బ్యాంక్‌.. కొత్త ఆర్థిక సంవత్సరంలో 2 వేల 500 కోట్ల రూపాయలకు పైగా నికర లాభాన్ని సొంతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. లోన్లు మరియు డిపాజిట్లలో 16 నుంచి 18 శాతం గ్రోత్‌ సాధించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తోంది. బిజినెస్‌తోపాటు ప్రాఫిట్స్‌ను సైతం పెంచుకోవటంపై ఫోకస్‌ పెట్టనుంది. ఈ విషయాలను యూకో బ్యాంక్‌ ఎండీ అండ్‌ సీఈఓ సోమ శంకర ప్రసాద్‌ తెలిపారు. డిసెంబర్‌ క్వార్టర్‌లో 653 కోట్ల రూపాయల నికర లాభాన్ని పొందినట్లు చెప్పారు. బ్యాంక్‌ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభమని అన్నారు.

ఈ ఏడాది 2 చిప్‌ ప్లాంట్లు!

దేశంలో ఎలక్ట్రానిక్‌ చిప్‌ తయారీ ప్లాంట్ల నిర్మాణాన్ని మొదలుపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ మేరకు ప్రస్తుత సంవత్సరంలో కనీసం రెండు కంపెనీలకైనా అనుమతి మంజూరు చేయాలని భావిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌ మరియు ఐటీ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. ఇండియా చేపడుతున్న సెమీ కండక్టర్‌ ప్రోగ్రామ్స్‌ దీర్ఘకాలిక లక్ష్యంతో కూడుకున్నవని చెప్పారు. ఎలక్ట్రానిక్‌ చిప్‌ మరియు డిస్‌ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు గతేడాది ఐదు సంస్థల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Airtel Payments bank
  • chip plants
  • NCLAT
  • paytm payments bank
  • RBI Governor

తాజావార్తలు

  • LPG Cylinder Booking: గ్యాస్‌ సిలిండర్ల కోసం భారీ క్యూలైన్ల నుంచి ఉపశమనం.. ఇలా చేయండి..

  • Vivo T5x 5G: బ్యాటరీ కింగ్.. వివో T5x 5G విడుదల.. 7200mAh బ్యాటరీ, 50MP Sony కెమెరా + 32MP సెల్ఫీ కెమెరా

  • Epstein Case: కేంద్రమంత్రి హర్దీప్ పూరి కుమార్తెకు ఊరట.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

  • Sarke Chunar Song: మంగ్లీకి ఇదేం పోయే కాలం.. బూతు పాటని తెలిసి పాడిందా నెటిజన్లు ఫైర్ !

  • Renault Duster 2026: OG బ్యాక్! రెనాల్ట్ డస్టర్ 2026 లాంచ్.. రూ.10.49 లక్షలకు రియల్ SUV కింగ్?

ట్రెండింగ్‌

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions