నటుడిగా రజనీకాంత్ ది నలభై ఆరేళ్ల సుదీర్ఘ ప్రయాణం. చిత్రం ఏమంటే నటుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న రజనీకాంత్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఏదీ ఇంతవరకూ దక్కలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఆయన్ని 2000 సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారంతోనూ, 2016లో పద్మ విభూషణ్ పురస్కారంతోనూ గౌరవించింది. ఇక తాజాగా 2021కి సంబంధించి సినిమా ప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘దాదా సాహెబ్ ఫాల్కే’ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా…
ఈరోజు అక్టోబర్ 25న న్యూఢిల్లీలో జరిగిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సూపర్స్టార్ రజనీకాంత్ ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. తన కుటుంబంతో కలిసి అవార్డుల వేడుకకు హాజరయ్యారు రజినీకాంత్. గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రజనీకాంత్కి అవార్డును అందజేసి అభినందించారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించిన రజనీకాంత్ చిరునవ్వుతో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు. తాను అందుకున్న ఈ అవార్డును తన గురువు కె బాలచందర్ కు, రజినీకాంత్ అన్నయ్య సత్యనారాయణ…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆదివారం అక్టోబర్ 25 తనకు చాలా ప్రత్యేకమని ప్రకటించారు. రేపు న్యూఢిల్లీలో ఆయన ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోనున్నారు. అలాగే రజిని రెండవ కుమార్తె సౌందర్య విశగన్ రజనీకాంత్ వాయిస్తో ఒక కొత్త యాప్ను విడుదల చేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం కోసం రజనీకాంత్ రేపు న్యూఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా తన జీవితంలో అక్టోబర్ 25 ప్రత్యేక రోజు అని వెల్లడించారు రజినీకాంత్. “రేపు (అక్టోబర్ 25) నాకు రెండు…
నటుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్గా చేసిన కృషికి గానూ సూపర్ స్టార్ రజినీకాంత్ 51 వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకోబోతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ గురువారం ఆయనను “భారతీయ సినిమా చరిత్రలో గొప్ప నటులలో ఒకరు” అని వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రధానమంత్రి మోడీ సైతం ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోవడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రజినీకాంత్ ట్విట్టర్ లో ఒక లేఖను…
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘పెద్దన్న’ చిత్రం దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. ఆ సినిమా తెలుగు వర్షన్ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ శనివారం సాయంత్రం విడుదల చేశారు. చిత్రం ఏమంటే… నవంబర్ 4వ తేదీనే విశాల్ కొత్త సినిమా ‘ఎనిమి’ సైతం జనం ముందుకు వస్తోంది. ‘అరిమ నంబి, ఇరు ముగన్’తో పాటు విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రాన్ని రూపొందించిన ఆనంద శంకర్ ‘ఎనిమి’ని డైరెక్ట్ చేశాడు. విశాల్ తో పాటు ఆర్య కీలక…
సూపర్స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శివ కాంబోలో ‘అన్నాత్తే’ అనే యాక్షన్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెలుగులో “పెద్దన్న” ఆమె టైటిల్ తో విడుదల కానుంది. అటు కోలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ లో రజినీ ఫాలోవర్స్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ‘అన్నాత్తే’ 4 నవంబర్ 2021 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. వినాయక చవితి సందర్భంగా మోషన్…
కోలీవుడ్ సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ డ్రామా చిత్రం “అన్నాత్తే”. రజినీకాంత్ కు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆయన సినిమాలో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల అవుతాయి. తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం “అన్నాత్తే”కు తెలుగు టైటిల్ ను ఖరారు చేశారు. దసరా సందర్భంగా ఈ సినిమా తెలుగు టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. రజనీకాంత్ ఫస్ట్ లుక్…
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూ.12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో పంపిణీ చేయబోతున్నారు. ఏషియన్…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్స్ట్ మూవీ ‘అన్నాత్తే’. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇంతకుముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు ఎందిరన్, పెట్టా లను కూడా ఈ బ్యానర్ పైనే నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్స్టార్ రజనీకాంత్తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్,…