అల్లుడు ధనుష్ మామ రజనీకాంత్ ని కూడా దాటేశాడు! అంతే కాదు, కమల్ హాసన్, విజయ్, సూర్య… కోలీవుడ్లో మరే స్టార్ కూడా ధనుష్ తో పోటీ పడలేకపోతున్నాడు! ట్విట్టర్ లో మన టాలెంటెడ్ యాక్టర్ దూకుడు అలా ఉంది మరి! తమిళంతో మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ దాకా విస్తరిస్తోన్న ధనుష్ సొషల్ మీడియాని కూడా వదలటం లేదు. ట్విట్టర్ లో ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటాడు. ఇంత భారీగా అనుచరులు…
తలైవా రజినీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఆయన నటించిన “ముత్తు” అక్కడ విడుదలై అద్భుతమైన విషయం సాధించింది. దీంతో అప్పటి నుంచి జపాన్ లో కూడా రజినీకి అభిమానగణం భారీగానే ఏర్పడింది. అందుకే తలైవా సినిమాలు జపాన్ లో కూడా రిలీజ్ అవుతాయి. తాజాగా రజినీకాంత్ మరో చిత్రం అక్కడ దుమ్ము రేపుతోంది. ఇండియాలో పొంగల్ కానుకగా 2020 జనవరి 9న రిలీజ్ అయిన “దర్బార్” మూవీకి మంచి స్పందనే వచ్చింది.…
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్…
2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా రాజకీయాలను విడిచి పెడుతున్నట్లు షాకింగ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రకటన అనంతరం ఇన్ని నెలల తరువాత తలైవా మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. రజనీకాంత్ తాజాగా తన సంస్థ “మక్కల్ మండ్రం” భవిష్యత్ గురించి తాజా ప్రకటనలో వివరించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం తనకు లేదని అన్నారు. కాబట్టి రజినీ “మక్కల్ మండ్రం” ఇకపై పని…
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ ను ముగించుకుని ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చారు తలైవా. దానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతానికి రజినీ “అన్నాత్తే” చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి పడింది. రజినీకాంత్ నటనకు స్వస్తి పలకబోతున్నారని పలు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాలపై భారీ అంచనాలు, ఆసక్తి మొదలైపోయాయి.…
సూపర్ స్టార్ రజనీకాంత్ యూఎస్ నుంచి మళ్ళీ చెన్నైకి తిరిగొచ్చేశారు. ప్రస్తుతం ఆయన రాకకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 19న తలైవా తన భార్యామణితో కలిసి చెన్నై నుంచి అమెరికాకు పయనమైన విషయం తెలిసిందే. రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆయన అమెరికాకు వెళ్లారు. ఫ్లోరిడాలోని మాయో క్లినిక్ వైద్య కేంద్రంలో ఆయన ఉన్న పిక్స్ బయటకొచ్చి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. Read Also : ‘భాయ్ జాన్’పై బిజినెస్…
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’ నవంబర్ 4వ తేదీ దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కీర్తి సురేశ్ , నయనతార, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, సూరి కీలక పాత్రలు పోషించారు. డి. ఇమ్మాన్ సంగీతం సమకూర్చాడు. అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రకటన…
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఇటీవలే అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అమెరికా వెళ్ళినప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే, తాజాగా రజనీ అమెరికాలోని తన స్నేహితులలో కలిసి ఖుషిఖుషీగా మాట్లాడుతున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రజనీ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రజనీ అమెరికాలోని అత్యుత్తమైన మాయో క్లినిక్లో ఇటీవల…
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో యూఎస్ లో ఉన్నారు. యూఎస్ లోని వెస్ట్ వర్జీనియాలో ఉన్న ఆయన అభిమానులతో దిగిన తాజా పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ లో రజినీకాంత్ నీలిరంగు చొక్కా. బూడిద రంగు ప్యాంటు ధరించి కన్పిస్తున్నారు. జూన్ 19న రజినీకాంత్ తన భార్యతో కలిసి అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. యూఎస్ లోని మాయో క్లినిక్లో తన సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారు. 2016లో…
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా యూఎస్ లో కన్పించగా క్లిక్ మని అనిపించిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఈ పిక్ లో ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్ లోని మాయో క్లినిక్లో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 19న రజినీ తన భార్య లతతో కలిసి రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన విషయం విదితమే. ఆయన 2016లో అక్కడే కిడ్నీ…