Kota: మెదడుకు ఎక్కని చదువులు, తీవ్ర ఒత్తిడి, ఎక్కడ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చలేమో అనే భయం ఇలా నీట్ విద్యార్థుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా రెండు పదులు నిండని వయసులోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ హబ్ గా పేరున్న రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
State Elections: ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఉన్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు.
Shanti Dhariwal: ఈ మధ్య రాజస్థాన్ లోని కోటా జిల్లాలో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షల కోచింగ్కు ప్రధాన కేంద్రం రాజస్థాన్ లోని కోటా. ఇటీవల కోటాలో కోచింగ్ తీసుకుంటున్న 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రాజస్థాన్ మంత్రి శాంతి ధరీవాల్ స్పందించారు. నెంబర్ 1 గా ఉండాలని తల్లిదండ్రులు చేసే ఒత్తిడి, ఎఫైర్ల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి కేసు విషయంలోనూ…
ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు రోజుల పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రోజుకు కేవలం 5 లీటర్ల నీటిని మాత్రమే కుటుంబం…
NEET: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) విద్యార్ధుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చదువుల వల్ల ఒత్తిడి, తల్లిదండ్రుల కలలను నేరవేర్చలేమో అనే దిగులుతో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. రాజస్థాన్ కోటాలో ఇప్పటికే చాలా మంది పిల్లలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. తాజాగా 16 ఏళ్ల నీట్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కోటా నగరంలో ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం విచారం కలిగిస్తోంది.
After Bus Breakdown Truck Runs Over It: ఈ మధ్యకాలంలో ప్రమాదం ఎటునుంచి పొంచి వస్తుందో తెలియడం లేదు. ప్రాణం ఎప్పుడు పోతుందో అర్థం కావడం లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో మరణం వెంటాడుతూ వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సును ట్రక్కు వేగంగా ఢీకొట్టడంతో 11 మంది చనిపోయారు. రాజస్తాన్ లోని భరత్ పూర్ లో ఈ ఘటన జరిగింది. Also Read:…
Monu Manesar: వివాదాస్పద గోసంరక్షుడు మోనూ మనేసర్ ని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తలను హత్య చేశాడని, జూలై నెలలో హర్యానాలో నూహ్ ప్రాంతంలో మతకలహాలు పెరిగేందుకు కారకుడయ్యాడనే అభియోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో హర్యానాలో కారులో ఇద్దరు ముస్లింల శవాలు కాలిపోయన స్థితితో బయటపడ్డాయి. ఈ ఘటనలో మనేసర్ కీలక నిందితుడిగా ఉన్నాడు.
Gang Rape On Woman: మహిళలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వారిపై ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలయడం లేదు. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఎంత మంది పోలీసులు పహారా కాస్తున్న ఏదో ఓ మూల ఆడ పిల్ల అత్యాచారానికి గురవుతూనే ఉంది. కొన్ని సార్లు అందరూ ఉన్నా పట్టపగలు నడిరోడ్డుపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా వారిని అంతమొందిస్తున్నారు కూడా. తాజాగా వాకింగ్ చేస్తున్న మహిళను ఎత్తుకెళ్లి సామూహిక…
చాలా మంది గుడికి వెళితే ప్రశాంతత ఉంటుందని చెబుతారు.. అక్కడ జనాలు ఉన్నా సరే ఆ ప్రాంగణంలోకి కాలు పెట్టగానే తెలియని అనుభూతి కలుగుతుంది. అందుకే వీలు చూసుకొని మరీ చాలా మంది గుడికి వెళ్తుంటారు..అయితే బ్రహ్మదేవుని ఆలయాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాష్ట్రంలోని బ్రహ్మ ఆలయానికి వెళ్లడం ద్వారా తలరాతలు మారిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఏం కోరుకున్న కూడా వెంటనే జరిగిపోతాయని పండితులు చెబుతున్నారు.. ఆ ఆలయం గురించి…