Rahul Gandhi: ఎంపీ, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా..? రాహుల్ ఏమన్నారంటే..?
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని, తెలంగాణలో బహుషా గెలవవచ్చని అన్నారు. రాజస్థాన్ లో విజయం సాధించే అవకాశం ఉందని, బీజేపీతో పోటీ ఉంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో విజయం సాధించదనే విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. తెలంగాణలో బీజేపీ పతనమైందని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
Read Also: Health Tip: డెంగ్యూ బారిన పడి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందా? ఇలా పెంచుకోండి
బీజేపీ అంతర్గతంగా కూడా ఇవే ఫలితాలు ఉంటాయని ఊహిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.కూటమి గురించి మాట్లాడుతూ.. మేం దేశంలో 60 శాతం ఉన్నామని, 2024 ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఫలితాలను కాంగ్రెస్ నియంత్రిస్తుందని, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత గురించి.. ఆ రాష్ట్ర ప్రజల్ని అడిగితే ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నామని చెబుతారని రాహుల్ గాంధీ అన్నారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ..కులగణన డిమాండ్ పై ప్రజల మనస్సులను మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో ప్రజల కోసం స్పష్టమైన విజన్ ఇచ్చామని అన్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!