Rahul Gandhi: ఎంపీ, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తుందా..? రాహుల్ ఏమన్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఐదు రాష్ట్రాల ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని, తెలంగాణలో బహుషా గెలవవచ్చని అన్నారు. రాజస్థాన్ లో విజయం సాధించే అవకాశం ఉందని, బీజేపీతో పోటీ ఉంటుందని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో విజయం సాధించదనే విమర్శల్ని ఆయన కొట్టి పారేశారు. తెలంగాణలో బీజేపీ పతనమైందని ఆయన అన్నారు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Health Tip: డెంగ్యూ బారిన పడి రోగ నిరోధక శక్తి తగ్గిపోయిందా? ఇలా పెంచుకోండి
బీజేపీ అంతర్గతంగా కూడా ఇవే ఫలితాలు ఉంటాయని ఊహిస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.కూటమి గురించి మాట్లాడుతూ.. మేం దేశంలో 60 శాతం ఉన్నామని, 2024 ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేస్తాయని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఫలితాలను కాంగ్రెస్ నియంత్రిస్తుందని, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకత గురించి.. ఆ రాష్ట్ర ప్రజల్ని అడిగితే ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నామని చెబుతారని రాహుల్ గాంధీ అన్నారు.
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై లోక్సభలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాహుల్ గాంధీ..కులగణన డిమాండ్ పై ప్రజల మనస్సులను మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ముఖ్యమైన పాఠాన్ని నేర్పిందని రాహుల్ గాంధీ అన్నారు. కర్ణాటకలో ప్రజల కోసం స్పష్టమైన విజన్ ఇచ్చామని అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!