Assembly Election Date: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. అన్ని రాజకీయ పార్టీలు ఇక పై క్షణం తీరిక లేకుండా గడిపే సమయం వచ్చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నేడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేయనుంది.
రాజస్థాన్లోని భరత్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి నిద్రిస్తున్న సమయంలో తమ్ముడిని తన అన్న కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా గ్రామంలో జరిగింది. వీరిద్దరి మధ్య పంటల పంపిణీపై అర్థరాత్రి ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో తమ్ముడిని అన్న దారుణంగా హతమార్చాడు.
గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్పై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గెహ్లాట్ ప్రభుత్వ విజన్ డాక్యుమెంట్ను 'అబద్ధాల మూట'గా ఆయన అభివర్ణించారు. సీఎం గెహ్లాట్ను ఉద్దేశించి.. తనకు రాష్ట్రంపై అంత శ్రద్ధ ఉంటే 2018లో సీఎం అయిన వెంటనే విజన్ డాక్యుమెంట్ రూపొందించి ఎందుకు అమలు చేయలేదన్నారు.
రాజస్థాన్లోని సరిహద్దు జిల్లా జైసల్మేర్లో దారుణానికి ఒడిగట్టిన ఉదంతం అందరినీ కలిచివేసింది. కన్నతండ్రే తన 5 ఏళ్ల అమాయక కూతురిని తన మోహానికి బలి చేసి అత్యాచారం చేశాడు.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులతో సీఈసీ భేటీ అయింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్తో పాటు మిజోరాం ఎన్నికల పరిశీలకులతో అనేక అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
Rajasthan Voter List: రాజస్థాన్లో ఈ ఏడాది నవంబర్-డిసెంబర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఎన్నికల కోసం కమిషన్ అన్ని రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, ఇతర వ్యక్తులతో సమావేశాలు నిర్వహించింది.
రాజస్థాన్లోని కోటా నగరంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. బీఏ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. చదువు విషయంలో ఆమె డిప్రెషన్తో బాధపడేదని తెలిసింది.
‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ హైకోర్టులో క్షమాపణలు చెప్పారు. గెహ్లాట్ తన వ్రాతపూర్వక సమర్పణలో, తన వ్యాఖ్యలు తన ఆలోచనలు కాదని, బాధ కలిగించి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.