Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
Udaipur Tailor Murder Case: గతేడాది రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ని ఇద్దరు మతోన్మాదులు అత్యంత దారుణంగా తలను నరికి చంపారు. షాపులో పనిచేసుకుంటున్న సమయంలో కస్టమర్లుగా వచ్చిన రియాజ్ అట్టారి, మహ్మద్ గౌస్ కత్తితో తలను నరికేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మహ్మద్ ప్రవక్తపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియా పోస్ట్ పెట్టిన కారణంగా ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.
Story Board: ఐదు రాష్ట్రాల ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్గా తీసుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలో నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక,…
భార్య మరణవార్త తెలియడంతో సరిహద్దు భద్రతా దళం(BSF) జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ఓ బీఎస్ఎఫ్ జవాను ఫోన్లో తన భార్యతో గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్లో ఉన్న తన భార్య మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Congress Candidate List: కాంగ్రెస్ పార్టీ నేడు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
Zomato: ఇటీవల కాలంలో జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ ఫ్లాట్ఫారంల వినియోగం చాలా పెరిగింది. ముఖ్యం మెట్రో సిటీలతో పాటు మమూలు పట్టణాల్లో కూడా వీటికి డిమాండ్ ఏర్పడింది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వీరి సేవల్లో తప్పులు జరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ జోధ్పూర్ నగరంలో ఓ వినియోగదారుడికి జొమాటో వెజ్ స్థానంలో నాన్-వెజ్ ఫుడ్ని డెలివరీ చేసింది.
Rajasthan: మద్యం మత్తులో తామ ఎంతటి దారుణానికి పాల్పడుతున్నారో తెలియలేదు. స్నేహితుడిని పొడిచి చంపారు. సిగరేట్ షేర్ చేసుకోలేదనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్ఠాన్ లోని ఉదయ్పూర్లో చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడు జై అలియాస్ జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు.
Rajasthan: ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని నవంబర్ 30తో ముగించి, డిసెంబర్ 3న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. 2024 లోక్సభ ఎన్నికల ముందు వస్తున్న అసెంబ్లీ ఎన్నికలు కావడంతో అందరి చూపు ఈ ఎన్నికలపై ఉంది.
5 రాష్ట్రాల ఎన్నికలకు ఎల క్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చాలా కీలకం కాబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.