మునుగోడులో టీఆర్ఎస్ గెలవడం ఖాయమని కరీంనగర్ జిల్లా మాజీ ఎంపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై జనం నిరసనతో ఉన్నారని తెలిపారు. ట్యాక్సీ కట్టే సంపన్న వర్గాలకు మద్దతుగా మోడీ మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు.
కోమటి రెడ్డి కుటుంబాన్ని బీజేపీ కొనుక్కుందని రాష్ట్రమంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెచ్చిన అతనికీ, కారణం అయిన వారు సరిగ్గా చెప్పలేక పోతున్నారన్నారు.