Mla JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్-బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క ఓటు ఎక్కువ అయినా మేము సంపాదిస్తామన్నారు. టీఆర్ఎస్ బీజేపీ లు అధికారంలో ఉండి అంగ బలాన్ని, అర్థ బలాన్ని ఓటర్ల పై ప్రయోగించడానికి చూస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేదన్నారు. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందన్నారు.
Read Also: T20 World Cup: పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదు.. స్పష్టం చేసిన టీమిండియా కోచ్
Also Read
ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందన్నారు. కొయ్యలగూడెం గ్రామంలో దాదాపు 2200 ఓట్లు ఉన్నాయి, కాగా ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా గట్టిగా స్రవంతి గెలుపు కోసం పనిచేస్తుందన్నారు. కేవలం నాయకులు ప్రలోభాలు పెట్టడం వల్లనే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.
అది ప్రజలందరికీ తెలుసని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనుంది. ప్రజలు కచ్చితంగా ఆమెని ఆశీర్వదిస్తారు. చౌటుప్పల్ మండలానికి మాజీ పీసీసీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. నాకు కోయలగూడెం ఇన్చార్జిగా ఇవ్వడం వల్ల ఈరోజు ప్రచారానికి రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాకు ఇన్చార్జ్ ఇచ్చిన కోయలగూడెంలో నేను పది రోజులు ఉండి ప్రచారం నిర్వహిస్తాను. మునుగోడు ప్రజలు పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వసిస్తున్నా అన్నారు.
Read Also: Mastan Vali: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!