Mla JaggaReddy: మునుగోడులో టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్కంఠ రేపుతోంది. టీఆర్ఎస్-బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా..చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ కంటే ఒక్క ఓటు ఎక్కువ అయినా మేము సంపాదిస్తామన్నారు. టీఆర్ఎస్ బీజేపీ లు అధికారంలో ఉండి అంగ బలాన్ని, అర్థ బలాన్ని ఓటర్ల పై ప్రయోగించడానికి చూస్తున్నారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి క్యాడర్ లేదన్నారు. మునుగోడులో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందన్నారు.
Read Also: T20 World Cup: పాండ్యాకు విశ్రాంతి ఇచ్చే ఉద్దేశం లేదు.. స్పష్టం చేసిన టీమిండియా కోచ్
Also Read
- Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
- Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
- HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
- DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
ఎక్కడ ఉప ఎన్నికలు జరిగిన అధికారంలో ఉన్న పార్టీ గెలుస్తుందన్నారు. కొయ్యలగూడెం గ్రామంలో దాదాపు 2200 ఓట్లు ఉన్నాయి, కాగా ఎన్నికల్లో కేవలం 2000 ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చాలా గట్టిగా స్రవంతి గెలుపు కోసం పనిచేస్తుందన్నారు. కేవలం నాయకులు ప్రలోభాలు పెట్టడం వల్లనే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.
అది ప్రజలందరికీ తెలుసని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురే ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనుంది. ప్రజలు కచ్చితంగా ఆమెని ఆశీర్వదిస్తారు. చౌటుప్పల్ మండలానికి మాజీ పీసీసీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. నాకు కోయలగూడెం ఇన్చార్జిగా ఇవ్వడం వల్ల ఈరోజు ప్రచారానికి రావడం జరిగిందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. నాకు ఇన్చార్జ్ ఇచ్చిన కోయలగూడెంలో నేను పది రోజులు ఉండి ప్రచారం నిర్వహిస్తాను. మునుగోడు ప్రజలు పాల్వాయి స్రవంతిని ఆశీర్వదించి గెలిపిస్తారని విశ్వసిస్తున్నా అన్నారు.
Read Also: Mastan Vali: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేక హోదా
తాజావార్తలు
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
-
Hyderabad: సీఎం, సజ్జనార్ పేర్లు వాడుకుంటూ దందా.. ‘గోల్డ్ మ్యాన్’పై కేసు నమోదు..
-
Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
-
Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!