Talasani Srinivas Yadav: రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav Controversial Comments On Rajagopal Reddy: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు ప్రజల్ని కోరారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కావాలనే దాడులు చేయించుకున్నారని.. ఇప్పుడు మునుగోడులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ని తిడుతున్నారే తప్ప.. మునుగోడు నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పడం లేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కేంద్రం నుంచి కనీసం రూ. 1 కోటి అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశారని తెలిపారు.
అంతకుముందు.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉప్పరిగూడ, ముదిరాజ్కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించిన తలసాని.. మునుగోడు నియోజకవర్గలోని ప్రజా సమస్యలు టీఆర్ఎస్తోనే పరిష్కారం అవుతాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మూడేన్నరేళ్లు ఆయన గ్రామాల వైపు చూడలేదని ఆరోపణలు చేశారు. అయితే.. సబ్బండ వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. బీజేపీ నేతల మాటల్ని నమ్మి మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనందిస్తోందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.
Also Read
- Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
తాజావార్తలు
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!