Talasani Srinivas Yadav: రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలు నమ్మొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani Srinivas Yadav Controversial Comments On Rajagopal Reddy: బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుభూతి డ్రామాలను నమ్మొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మునుగోడు ప్రజల్ని కోరారు. గతంలో దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కావాలనే దాడులు చేయించుకున్నారని.. ఇప్పుడు మునుగోడులో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ని తిడుతున్నారే తప్ప.. మునుగోడు నియోజకవర్గానికి బీజేపీ ఏం చేసిందో ఆ పార్టీ నేతలు చెప్పడం లేదని విమర్శించారు. దుబ్బాక, హుజూరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ నేతలు కేంద్రం నుంచి కనీసం రూ. 1 కోటి అయినా తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. మిషన్ భగీరథతో సీఎం కేసీఆర్ మునుగోడులో ఫ్లోరోసిస్ లేకుండా చేశారని తెలిపారు.
అంతకుముందు.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉప్పరిగూడ, ముదిరాజ్కాలనీలో ఇంటింట ప్రచారం నిర్వహించిన తలసాని.. మునుగోడు నియోజకవర్గలోని ప్రజా సమస్యలు టీఆర్ఎస్తోనే పరిష్కారం అవుతాయన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మూడేన్నరేళ్లు ఆయన గ్రామాల వైపు చూడలేదని ఆరోపణలు చేశారు. అయితే.. సబ్బండ వర్గాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. బీజేపీ నేతల మాటల్ని నమ్మి మరోసారి మోసపోవద్దని విజ్ఞప్తి చేసిన ఆయన.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం చేయూతనందిస్తోందని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.
Also Read
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!