Etela Rajender: ఇది కేసీఆర్ తెరలేపిన కొత్త నాటకం.. కాంగ్రెస్ని ముంచింది ఆయనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender Comments On Moinabad Farm House Issue: మొయినాబాద్ ఫామ్ హౌస్తో కేసీఆర్ సరికొత్త నాటకానికి తెరలేపాడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిశోర్ని కేసీఆర్ కలిస్తే.. తెలంగాణను గోల్మాల్ చేస్తాడని అనుకున్నామని, ఇప్పుడు అదే జరుగుతోందని విమర్శించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే సంప్రదాయం కేసీఆర్ది అని ధ్వజమెత్తారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఆ పార్టీ కొంప ముంచిన నాయకుడు కేసీఆర్ అని ఆరోపించారు. సీఎంను ప్రశ్నిస్తే మంత్రి పదవి పోతుందని తెలిసి కూడా తాను అడిగానని, మంత్రిగా ఉన్నపుడే టీఆర్ఎస్ పార్టీకి ఓనర్ని అని తాను చెప్పానన్నారు. హుజూరబాద్లో కేసీఆర్ వేల కోట్లు ఖర్చు పెడితే.. పసుపు బొట్టు తో ప్రమాణాలు చేయించిన హుజురాబాద్ ప్రజలకు ఆయనకు చెంప చెళ్లుమనించారని పేర్కొన్నారు. ఒక చెంప హుజూరాబాద్ ప్రజలు పగలగొడితే.. ఇంకో చెంప పగలగొట్టే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందన్నాడు. 3వ తేదీన మునుగోడు ఆత్మగౌరవం నిలబెట్టుకునెలా ప్రజలు తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
అటు.. రాజగోపాల్ రెడ్డి కూడా నలుగురు ఎమ్మెల్యేలను కొంటున్నారని పెద్ద డ్రామా చేశారంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారా,వు గువ్వల బాలరాజుకి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. మునుగోడుకి వచ్చి.. ఇక్కడున్న సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీల్ని టీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. లీడర్లను కొన్న కేసీఆర్.. మునుగోడు ప్రజల్ని కొనగలడా? లీడర్లు అమ్ముడుపోయారు.. మీరు అమ్ముడుపోతారా? అంటూ మునుగోడు ప్రజల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. తాను రాజీనామా చేయకపోతే.. ఈరోజు మీ ఊర్లకు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేసీఆర్ వచ్చేవారా? అని నిలదీశారు. తాను రాజీనామా చేసి, మీ కాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!