ఈసారి అమేథీలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారంటూ దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపింది. రాహుల్ గాంధీనే పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. తీరా.. కాంగ్రెస్ తొలి జాబితా వెలువడగానే ఆ ఉత్కంఠ వీడిపోయింది.
దేశ ముఖచిత్రాన్ని మార్చివేసే కీలకమైన లోక్సభ ఎన్నికలకు తెలంగాణ గడ్డ మీద నుంచే జంగ్ సైరన్ ఊదాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్... నరేంద్ర మోడీ నేతృత్వంలోని పదేళ్ల ఎన్డీఏ నిరంకుశ, దుష్పరిపాలనకు చరమగీతం పాడాలనే కృతనిశ్చయంతో ఉంది.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ కేరళలోని వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. అంతకముందు భారీ ర్యాలీ నిర్వహించారు. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Amit Shah: ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తప్పకుండా 400కి పైగా స్థానాలను సాధిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
PM Modi: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ మండుతుందని ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Mallikarjun Kharge: 2024 లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి మరో ఇబ్బందికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగంలో ఘోరమైన తప్పు చేశారు.
Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా బీజేపీ చెబుతున్నా 400 సీట్లు సాధ్యమా..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. 400 సీట్లు సాధించేందుకు ప్రధాని ‘అంపైర్లను’ ఎంచుకున్నారని ఆరోపించారు.