Siddaramaiah: మోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధాని చేయండి.. ఓటర్లను కోరిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోడీని గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రజల్ని కోరారు. శనివారం కోలార్లో నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. బీజేపీలా కాకుండా, కాంగ్రెస్ ఎల్లప్పుడు మాటపై నిలబడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఆయన ప్రజల్ని కోరారు. ‘‘నరేంద్రమోడీని గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని నేను మిమ్మల్ని వినయంగా కోరుతున్నాను’’ అని సిద్ధరామయ్య అన్నారు.
Read Also: PM Modi: కాంగ్రెస్ మేనిఫేస్టోలో “ముస్లిం లీగ్” ఆలోచనలు.. దేశాన్ని విడగొట్టే యత్నం..
Also Read
- Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
- Tamil Nadu Debt Crisis: పుట్టిన ప్రతి బిడ్డపై రూ.1.28 లక్షల అప్పు.. శ్వేతపత్రంలో సంచలన విషయాలు
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
కోలార్లో కురుదుమలే గణపతి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీ అని, ఓటమి భయంతో బీజేపీ సృష్టిస్తున్న అబద్ధాల జోలికి వెళ్లవద్దని ప్రజల్ని కోరారు. మోడీ ప్రభుత్వం (కేంద్రం) పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్లు, ఎరువులు, వంట నూనెలు, పప్పులు మరియు కూరగాయల ధరలను పెంచిందని సిద్ధరామయ్య ఆరోపించారు. దేశంలోని ప్రతీ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని ఆరోపించిన సీఎం.. ఈ కష్టాల నుంచి ప్రజల్ని రక్షించేందుకు మేము ఐదు హామీలను ప్రకటించి, అమలు చేస్తున్నామని అన్నారు. ఈ హామీల అమలు సాధ్యం కాదని బీజేపీ అబద్ధాలు చెప్పిందని, కానీ హమీలను అమలు చేసిన తర్వాత కొత్త అబద్ధాలను సృష్టిస్తున్నారని బీజేపీపై ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
ICC Women’s T20 World Cup: భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్థాన్ జట్టుకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ
-
Rajanna Sircilla: పానీపూరి ఫుడ్ పాయిజన్ కలకలం.. 10 మందికి పైగా చిన్నారులకు అస్వస్థత.!
-
Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్సభ స్పీకర్తో భేటీకి ఎంపీలు రెడీ..
-
Telangana Public School: ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభించనున్న సీఎం.!
-
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్బాల్ ఆటగాడిగా హిస్టరీ
ట్రెండింగ్
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 7540mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI Turbo 5 లాంచ్.! ధర ఎంతంటే.?
-
T20 World Cup 2026లో సంచలనం.. శ్రీలంక చరిత్రాత్మక విజయం.. డిఫెండింగ్ ఛాంపియన్కు వరుసగా రెండో షాక్!
-
6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్, 50MP సోనీ కెమెరాతో TECNO SPARK 50 Pro లాంచ్.!