Kishan Reddy: ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. ఓటు అడిగే హక్కు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సమక్షంలో ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా.. తెలంగాణ ప్రజల ఓట్లను అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు గెలుకోలేదని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో బీజేపీకి 90 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం ఎంపీ సీట్లు, తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.
Kidney Stones: ఈ చిట్కాలు పాటించండి.. కిడ్నీలో రాళ్లు సులభంగా తొలగిపోతాయి..!
Also Read
- Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
- YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Vaibhav Sooryavanshi: బెంచ్కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గాలిలో దీపం పెట్టి దేవుడా అన్నట్టు ఉందని దుయ్యబట్టారు. ఏం సాధించారని తుక్కుగూడలో మీటింగ్ పెట్టుకుంటున్నారని అన్నారు. మరోవైపు.. గ్యారంటీలు అమలు చేయమని సీఎం ఒప్పుకుంటున్నారు.. సీఎం గారు వంద రోజులు అంటే ఎప్పుడు అవుతుంది… డిసెంబర్ అంటే ఏ డిసెంబర్ అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నన్ని రోజులు రాహుల్ ప్రధాని కాడని విమర్శించారు.
IPL 2024: పసుపు మయంగా మారిన ఉప్పల్.. ఎక్కడ చూసినా పసుపు జెర్సీలే
ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఉంటారో.. విదేశాలకు వెళుతారో చూడాలన్నారు. మీకు తుక్కుగూడ ఏపీ, తమిళనాడు, బాంబే మీటింగ్ ఇవే సరిపాయే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతాంగం పేరుతో ఈరోజు దీక్షలు చేశామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణలో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొంటామని హామీ ఇచ్చామని.. రాష్ర్ట ప్రభుత్వం మాత్రం 5 వందల బోనస్ మాత్రం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా మోసం చేసే ప్రయత్నం చేశారు… ఇప్పుడు తుక్కుగూడ సభ పేరుతో ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుందని అన్నారు.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?