Rahul Gandhi: ఆలోచించండి, అర్థం చేసుకోండి.. ఓటర్లను కోరిన రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: లోక్సభ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ప్రారంభ కాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. భారతదేశం ప్రస్తుతం కీలక దశలో ఉందని, దేశాన్ని నిర్మించే వారికి, నాశనం చేసే వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ప్రజల భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది. వారు ఆలోచించి, అర్థం చేసుకుని, ఆపై సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించారు.
Read Also: Vegetarian Thali: వెజ్ థాలీ ధరలు పెరిగాయి, నాన్-వెజ్ థాలీ ధరలు తగ్గాయి.. కారణం ఇదే..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
ప్రస్తుతం దేశం ‘‘కీలమైన దశ’’లో ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్, భారత కూటమి అంటే యువతకు ఉద్యోగాలు, రైతులకు ఎంఎస్పీ హామీ, ప్రతీ పేద మహిళని లక్షాధికారి చేయడం, కార్మికులకు రోజుకు కనీసం రూ. 400, కులగణన, ఆర్థిక సర్వే, రాజ్యాంగం మరియు పౌరహక్కలని రక్షిస్తుందని అన్నారు. బీజేపీ అంటే నిరుద్యోగం, రైతులపై రుణభారం, రక్షణ మరియు హక్కులు లేని మహిళలు, నిస్సహాయ కార్మికులు, వివక్ష, నిరుపేదలపై దోపిడి, నియంతృత్వం, మోసపూరిత ప్రజాస్వామ్యం అని విమర్శించారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడుతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఆప్, శివసేన(యూబీటీ), డీఎంకే, ఎన్సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ వంటి పార్టీలో ఇండియా కూటమి సమాయత్తం అవుతోంది.
देश इस वक्त निर्णायक मोड़ पर खड़ा है!
हर वर्ग को ‘देश बनाने’ और ‘देश बिगाड़ने’ वालों के बीच का फर्क पहचानना होगा।
कांग्रेस और INDIA मतलब:
– युवाओं की पहली नौकरी पक्की
– किसानों को MSP की गारंटी
– हर गरीब महिला लखपति
– श्रमिक को न्यूनतम 400 रू प्रतिदिन
– जातिगत गिनती और…— Rahul Gandhi (@RahulGandhi) April 4, 2024
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?